IPL సీజన్ 16 లో ప్లేఆఫ్ రేసు చాలా ఉత్కంఠభరితంగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేఆఫ్ పరిస్థితి కాస్త క్లియర్గా మారింది.హైదరాబాద్ టీం పై విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్కు చేరిన మొదటి జట్టుగా గుజరాత్ నిలిచింది. అదే సమయంలో హైదరాబాద్ టీం ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్, సీఎస్కే ఇంకా ఆర్సీబీలకు ప్లేఆఫ్కు చేరే అవకాశాలు బాగా పెరిగాయి.ఇక CSK టీం గురించి చెప్పాలంటే ధోనీ టీం ప్రస్తుతం 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.CSK తమ చివరి మ్యాచ్లో కనుక విజయం సాధించగలిగితే, ప్లేఆఫ్స్లో ప్లేస్ ఖాయం అవుతుంది. చివరి మ్యాచ్లో ఓడిపోతే ప్లేఆఫ్ టిక్కెట్ను పొందడానికి CSK టీం ఇతర జట్లపై ఆధారపడాల్సి రావచ్చు.ముంబై ఇండియన్స్ టీం ఇప్పటి వరకు 14 పాయింట్లు సాధించింది.ముంబై ఇండియన్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక్కటైనా ముంబై ఇండియన్స్ గెలిస్తే ఖచ్చితంగా ప్లేఆఫ్కు చేరుకోవడం ఖాయం.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ టీం ప్రస్తుతం 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లక్నో టీం కూడా మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్లు గెలిస్తేనే లక్నో టీంకి ప్లేఆఫ్ టికెట్ ఖాయం అవుతుంది. అయితే ఒక మ్యాచ్ కనుక గెలిస్తే, లక్నో ఇతర జట్లపై ఆధారపడవలసి ఉంటుంది.RCB టీం కూడా ప్లేఆఫ్ రేసులోనే ఉంది. RCB మొత్తం 12 మ్యాచ్ల్లో 12 పాయింట్లు సాధించింది. RCB తన చివరి రెండు మ్యాచ్లను కనుక గెలిస్తే, అది ప్లేఆఫ్ టిక్కెట్ను పొందడం ఖాయం అవుతుంది. RCB టీం ఒక మ్యాచ్లో ఓడిపోతే, ప్లేఆఫ్కు చేరుకోవాలనే ఆశ కేవలం నెట్ రన్ రేట్పై మాత్రమే ఆధారపడి ఉంటుంది.రాజస్థాన్ రాయల్స్ టీం కేవలం 12 పాయింట్లను మాత్రమే కలిగి ఉంది. ఇక ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. పంజాబ్ కింగ్స్ మాత్రం ప్లేఆఫ్ రేసులో ఇంకా కొనసాగుతోంది.అలాగే అదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ప్లేఆఫ్ రేసులో లేవు.