ధోని తల్లికి థాంక్స్ చెప్పిన ఫ్యాన్.. ఎందుకో తెలుసా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరి క్రికెటర్లకు అభిమానులు ఉంటే అటు ధోనీకి మాత్రం డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. అయితే ధోని పేరు వినిపించింది అంటే చాలు పూనకాల వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు అభిమానులు. ఇకపోతే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో  చెన్నై జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా ఇక అభిమానులు అందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. అదే చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరిగితే ఇక స్టేడియం మొత్తం పసుపు రంగులోకి మారిపోతుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవలే చెన్నైకి హోమ్ గ్రౌండ్ గా పిలుచుకునే చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. అయితే చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి చెన్నై జట్టు ఓడిపోయింది అని చెప్పాలి. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక అభిమాని పట్టుకున్న ప్లకార్డు మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది అభిమానులు ఆసక్తికర ఫ్లకార్డులు  పట్టుకుని కెమెరా కంటపడటం లాంటివి చేస్తున్నారు.

 ఇప్పుడు ఒక అభిమాని ఏకంగా మహేంద్ర సింగ్ ధోనీకి కాదు ఆయనను కన్న తల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మదర్స్ డే కావడం.. అదే రోజు చెన్నైలోనే చపాక్ స్టేడియం వేదికగా మహేంద్రసింగ్ ధోని మ్యాచ్ ఆడటంతో ఒక అభిమాని ఆసక్తికర ఫ్లకార్డుని  ప్రదర్శించింది. ధోని తల్లికి శుభాకాంక్షలు చెబుతూ థాంక్స్ దేవకి గారు.. మీరు మాకు ధోనినీ ఇచ్చారు. హ్యాపీ మదర్స్ డే అని రాసిన ఫ్లకార్డు  ప్రదర్శించగా ఇక ఈ ప్లకార్డు అటు ధోని అభిమానులు అందరిని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: