ఈ IPL సీజన్లో భాగంగా చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యచ్లో ఏకంగా 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ధోని టీం .. పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ కి చేరుకుంది.మొత్తం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే టీం రుత్రాజ్, కాన్వే చెలరేగడంతో 17.4 ఓవర్లలో ఛేదించింది.ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ తరువాత సీఎస్కే కెప్టెన్ ఎంస్ ధోని స్పందించాడు. కీలకమైన మ్యాచ్లో గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో మూడు వికెట్లతో అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరానాపై కూడా ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ విజయం మాకు చాలా కీలకం. గత కొన్ని మ్యాచ్ల్లో ఫలితాలు మాకు అంతగా అనుకూలంగా లేవు.అందువల్ల పాయింట్ల పట్టికలో మేము కాస్త వెనుకబడ్డాం.
ఇప్పుడు మళ్లీ ఈ విజయంతో ముందుకు వెళ్లడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలని భావించాను. కానీ వర్షం వచ్చే ఛాన్స్ ఉండడంతో నా నిర్ణయాన్ని లాస్ట్ మినిట్ లో మార్చుకున్నాను. అందుకే మొదట బౌలింగ్ ఎంచుకున్నాను. ఇంకా అదేవిధంగా వికెట్ కూడా చాలా నెమ్మదిగా ఉంది.కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మా బౌలర్లు కూడా బాగా నిరూపించారు. మా పేసర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పతిరానా మా టీంకి , శ్రీలంకకు దొరికిన నిజమైన ఆస్తి. అతడు రెడ్ బాల్ క్రికెట్ కాకుండా వైట్ బాల్ క్రికెట్లో మాత్రమే ఆడేటట్లు శ్రీలంక క్రికెట్ ఖచ్చితంగా చూసుకోవాలి. అతడికి ఎన్నో అద్భుతాలు సృష్టించే సత్తా ఉంది. ఇంకా అదే విధంగా అతడు గత సీజన్ కంటే ఈ సీజన్లో కాస్త దృఢంగా ఉన్నాడని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధోని పేర్కొన్నాడు.