2023 ఐపీఎల్ విన్నర్ ఎవరో.. ముందే చెప్పేసిన రవిశాస్త్రి?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న పోరులో అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రతి మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్న ప్రేక్షకులు మ్యాచ్లోని మజాను తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇక ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా  మారిపోయింది అని చెప్పాలి.

 పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచి ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రతి టీం కూడా హోరాహోరీగా పోరాడుతూ ఉంది. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఏ జట్లు ప్లే ఆఫ్ లో అడుగు పెడతాయి. ఇక ఏ టీం అటు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలుస్తుంది అనే విషయంపై తెగ రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు. గతంలో భారత మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఇలా ప్లే ఆఫ్ వెళ్ళబోయే నాలుగు జట్ల వివరాలను ప్రకటించారు.ఇక ఇటీవల ఇదే విషయంపై అటు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా స్పందించాడు అని చెప్పాలి.

 2023 ఐపీఎల్ సీజన్ టైటిల్ విజేత ఎవరు అన్న విషయాన్ని రవి శాస్త్రి ముందే చెప్పేశాడు. గత ఏడాది ఐపీఎల్లోకి వచ్చి ఇక మొదటి ప్రయత్నంలోనే టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోతుంది అంటూ రవి శాస్త్రి అంచనా వేశాడు. ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ జట్టు ప్రస్తుతం సమతూకంగా ఉంది. ఆ జట్టులోని ఆటగాళ్లందరూ సమిష్టిగా ఆడుతున్నారు. ఏడు నుంచి 8 మంది ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతమైన ఫాం ఇక పాయింట్స్ టేబుల్ లో నెంబర్స్ చూస్తుంటే.. గుజరాత్ టైటిల్ విజేతగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను అంటూ రవి శాస్త్రి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: