జట్టును గెలిపించిన కోహ్లీకి.. ఊహించని షాక్?
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇలా బెంగళూరు జట్టును కోహ్లీ కెప్టెన్ గా ముందుకు నడిపిస్తున్న నేపద్యంలో.. ఈ మ్యాచ్లను చూసి ఎందుకొ అటు అభిమానులు కూడా మరింత ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక కోహ్లీ కెప్టెన్సీలో అటు జట్టు రెండు విజయాలు సాధించడంతో మరింత ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ బెంగళూరు జట్టుకు విజయం అందించిన నేపథ్యంలో ఫాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయ్. జట్టులోని సభ్యులందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. కానీ ఇలా జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీకి మాత్రం ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.
ఏకంగా విరాట్ కోహ్లీ 24 లక్షల రూపాయల జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు అయిన కారణంగా బెంగళూరు జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీకి రిఫరీ 24 లక్షల జరిమానా విధించారు. అంతేకాకుండా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ తో పాటు ఇతర ఆటగాళ్లు అందరికీ కూడా ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజు లో 25% కోత గా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. కాగా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో బెంగళూరు జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.