యశస్వి, జోస్ బట్లర్, సంజూశామ్సన్, హెట్మయిర్, పడికల్, రియాన్ పరాగ్ ఇంకా ధ్రువ్ జురేల్.. ఇలా అదరగొట్టే బ్యాటర్ల ఉన్నప్పటికీ కేవలం 155 పరుగులను ఛేదించలేకపోయింది రాజస్థాన్ రాయల్స్ టీం.ఇక వీళ్ల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉంది. అయినా రాజస్థాన్ టీం తమ సొంత మైదానంలో చాలా దారుణంగా ఓటమిపాలైంది.జైపూర్ సిటీలో నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ జరగడం గమనార్హం. అయితే సొంత ప్రేక్షకుల మధ్య గుజరాత్ చేతిలో ఏకంగా 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది రాజస్థాన్ టీం. మొత్తం 155 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ ( 35 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (41 బంతుల్లో 40) తప్ప మరెవరూ కూడా పెద్దగా రాణించలేదు. అందరూ అలా వచ్చి ఇలా వెనుదిరిగిపోవడం జరిగింది.ఇక 'ఆట తక్కువ.. ఆటిట్యూడ్ ఎక్కువ' అంటూ చాలా దారుణంగా విమర్శలు ఎదుర్కొంటోన్న రియాన్ పరాగ్ 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు. కానీ టీంని గెలిపించలేకపోయాడు. దీంతో మరోసారి ట్రోలర్లకు ఇతడు బాగా టార్గెట్గా మారిపోయాడు. రాబిన్ ఊతప్ప ఇంకా రవిశాస్త్రి లాంటి టీం ఇండియా మాజీ క్రికెటర్లు కూడా రియన్ ఆటతీరు మార్చుకోవాలంటూ సలహాలిస్తున్నారు.
ఇక ఈ సీజన్లో ఇప్పటి దాకా పరాగ్ మొత్తం 6 మ్యాచ్లు ఆడాడు. అతను కేవలం 54 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇక లక్నోపై 12 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు 5 మ్యాచ్లలో అతని స్కోర్లు చూస్తే కేవలం 15, 5, 7, 20, 7 మాత్రమే. దీంతో పరాగ్ ఆటతీరుపై సోషల్ మీడియాలో చాలా దారుణంగా వస్తున్నాయి. 2019 వ సంవత్సరం నుంచి ఐపీఎల్ ఆడుతున్న రియాన్ పరాగ్.. తన కెరీర్ లో ఇప్పటి దాకా 51 మ్యాచ్ లు ఆడి కేవలం 561 పరుగులు చేశాడు. అందులో కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇక గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ సందర్భంగా పరాగ్ చేసిన ఓవరాక్షన్ అయితే అసలు అంతా ఇంత కాదు. అందుకే ఇతడిని బిల్డప్ బాబాయ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. జట్టులో అనవసరంగా ఉంచుతున్నారంటూ ఇతడిపై చాలా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇతనో యాటిట్యూడ్ నిబ్బా అంటూ ట్రోల్ చేస్తున్నారు.