రోహిత్ అరుదైన రికార్డ్.. ఐపీఎల్ లో నలుగురికే సాధ్యమైంది?
ఇకపోతే ఐపీఎల్ హిస్టరీలో కేవలం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమైన ఓ అరుదైన రికార్డును ఇటీవల రోహిత్ శర్మ కూడా సాధించాడు. ఇటీవల ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో అటు ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై విజయం సాధించడమే కాదు అటు రోహిత్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో 6 వేలపరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా ఘనత సాధించాడు రోహిత్ శర్మ.
హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో 28 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డును సాధించాడు అని చెప్పాలి. ఈ జాబితాలో అటు రోహిత్ శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ 6844 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ 6477 పరుగులతో ఈ లిస్టులో రెండవ స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 6109 పరుగులతో ఈ లిస్టులో ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే రోహిత్ శర్మ ఇలా అరుదైన ఘనత సాధించడం పై అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.