ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా ఈరోజు మరో ఆసక్తికర యుద్దానికి రంగం సిద్దమైంది. చెన్నైలోని చిదంబరం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ తలపడనున్నాయి.ఈ సీజన్లో ఇప్పటి దాకా రెండు జట్లు చెరో మూడు మ్యాచ్లు ఆడాయి.అవి రెండేసి విజయాలు సాధించగా ఒక్కొ మ్యాచ్లో ఓడిపోయాయి.మ్యాచ్ల పరంగా సమానంగా గెలిచినప్పటికీ మెరుగైన రన్రేట్ కారణంగా రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలవగా చెన్నై టీం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ్టి మ్యాచ్లో విజయం సాధించి తమ స్థానాలను మెరుగుపరచుకోవాలని రెండు జట్లు కూడా బావిస్తున్నాయి.ఈ నేపథ్యంలో హోరా హోరీగా పోరు జరిగే ఛాన్స్ ఉంది.ఇప్పటి దాకా రెండు జట్లు ఆడిన మ్యాచులను కనుక ఒక్కసారి గమనిస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగని చెన్నైని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకంటే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన చెన్నై ఎంత ప్రమాదకర జట్టో అందరికి తెలిసిందే.
పైగా ధోని కెప్టెన్సీలో ఐదో సారి టైటిట్ గెలవాలని ఆ టీం ఉవ్విళ్లూరుతుంది.అయితే రాజస్థాన్ బ్యాటర్లు మాత్రం ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు. ఆడిన మూడు మ్యాచుల్లో కూడా ఆ జట్టు భారీ స్కోరు చేసింది.ముఖ్యంగా ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్లతో పాటు కెప్టెన్ సంజు శాంసన్, హెట్మైర్ లు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇంకా వీరితో పాటు దేవ్దత్ పడిక్కల్ కూడా రాణిస్తే బ్యాటింగ్లో ఆ టీంకి ఇక తిరుగులేదు. ఇక బౌలింగ్లో కూడా సీనియర్ బౌల్డ్, జాసన్ హోల్డర్, అశ్విన్ ఇంకా చహల్ లు ప్రత్యర్థి బ్యాటర్లను ఎంతగానో ముప్పులు తిప్పలు పెడుతున్నారు.చెన్నై సూపర్ కింగ్స్ టీంని గాయాలు బాగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా కోట్లు పోసి కొనుకున్న దీపక్ చాహర్ ఇంకా బెన్ స్టోక్స్లు గాయాలతో ఎంతగానో సతమతం అవుతున్నారు. రాజస్థాన్తో మ్యాచ్కు వీరు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. వీరి స్థానంలో మహీశ్ తీక్షణ ఇంకా పథిరాన టీంలోకి వచ్చే అవకాశం ఉంది.