ఐపిఎల్ కు ముందు.. దినేష్ కార్తిక్ కు బంపర్ ఆఫర్?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టులో సీనియర్ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు దినేష్ కార్తీక్. అయితే గత ఏడాది ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. అయితే అతని మెరుపు ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. నిజంగా ఐపీఎల్ లో మేము చూస్తున్నది మాకు అందరికీ తెలిసిన దినేష్ కార్తీక్ ఏనా అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆశ్చర్యపోయే విధంగా తన ప్రస్థానాన్ని కొనసాగించాడు అని చెప్పాలి. అంతేకాదు తన మెరుపు ఇన్నింగ్స్ తో ఇక టీమ్ ఇండియాలో ఎన్నో రోజుల నుంచి ఖాళీగా ఉన్న ఫినిషర్ పాత్రకు తానే సరైన వాడిని అన్న విషయాన్ని తన ఆటతీరుతో నిరూపించాడు.

 ఇంకేముంది అప్పటివరకు టీమిండియా తరఫున అతను ఆడింది. అడపాదడపా మ్యాచ్ లు ఆడినప్పటికీ అతనిపై నమ్మకం ఉంచి. ఇక టీమ్ ఇండియాలో చోటు కల్పించింది. అయితే ద్వైపాక్షిక సిరీస్ లలో బాగా రాణించిన దినేష్ కార్తీక్ టి20 వరల్డ్ కప్ లో మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఇక జట్టు యాజమాన్యం అతని పక్కన పెట్టింది. దీంతో గత కొంతకాలం నుంచి కూడా కామెంటేటర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు దినేష్ కార్తీక్. ఇకపోతే ఇటీవల దినేష్ కార్తీక్ ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అన్నది తెలుస్తుంది. ఏకంగా యాశేష్ సిరీస్ కు కామెంటెటర్ వచ్చిందని దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

 ఈ క్రమంలోనే స్కై క్రికెట్ ఛానల్ కు ఈ ఆఫర్ ఇచ్చినందుకుగాను ధన్యవాదాలు చెప్పాడు దినేష్ కార్తీక్. కాగా భారత్ నుంచి ఈ సిరీస్లో కామెంట్రీ చేయబోతున్నది దినేష్ కార్తీక్ ఒక్కడే కావడం గమనార్హం. దీంతో ఈ విషయం తెలిసి ఇక డీకే అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఐపీఎల్ లో ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న డీకే.. గత ఏడాది మంచి ప్రదర్శన చేశాడు. ఇక ఈ ఏడాది అతని ఆటపై భారీగానే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: