వైజాగ్లో కోహ్లీ రికార్డులు ఇవే.. రిపీట్ అవుతాయా?

Purushottham Vinay
ఇక ఇండియా ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ రెండో మ్యాచ్ ఇప్పుడు (మార్చి 19న) జరుగుతుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది.అయితే ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. ఒకవేళ ఆస్ట్రేలియా టీం సిరీస్‌లో కొనసాగాలంటే, ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా ఎలాగైనా గెలవాల్సిందే. లేకుంటే ఆసిస్ చేతిలో నుంచి సిరీస్‌ పోతుంది. వన్డే సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఏది ఏమైనా విశాఖలో టీమిండియాకు అయితే చాలా మంచి రికార్డు ఉంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ పిచ్ లో చేసిన సెంచరీల గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుతుంటారు.విశాఖపట్నంలో వన్డేల్లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు ఎన్నటికీ మరచిపోలేనివి.విశాఖపట్నంలో టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు.


రాజశేఖర రెడ్డి స్టేడియంలో కింగ్ కోహ్లి ఇప్పటి దాకా మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను ఏకంగా 556 పరుగులు చేశాడు. అందులో మొత్తం అతను 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు సాధించాడు. విశాఖపట్నంలో అతని అత్యధిక స్కోరు విషయానికి వస్తే.. 157 పరుగులతో నాటౌట్‌తో నిలిచాడు. విశాఖలో విరాట్ కోహ్లీ వన్డే రికార్డును రికార్డుని పరిశీలిస్తే.. 118, 117, 99, 65, 157, 0 పరుగులు కోహ్లీ చేశాడు.ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో రోహిత్ శర్మ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్‌లో రోహిత్ ఆడలేకపోయాడు.ఇక రోహిత్ పునరాగమనంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇంకా ఈ టైం లో హిట్‌మాన్ తన కెప్టెన్సీలో మరో వన్డే సిరీస్‌ను గెలవాలనుకుంటున్నాడు. మరి చూడాలి ఈ మ్యాచ్ లో కోహ్లీ మళ్ళీ రికార్డులు మెరిపిస్తాడో లేదో. ఇంకా ఈ మ్యాచ్ ని మనోళ్లు రికార్డు స్థాయిలో గెలుస్తారో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: