ఫ్యాన్స్ గర్వపడే విషయం చెప్పిన అనుష్క.. కోహ్లీకి సెల్యూట్ చేయాల్సిందే?

praveen
నాలుగో టెస్ట్ మ్యాచ్లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో అటు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ గురించి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు మూడున్నర ఏళ్ల నుంచి సెంచరీ అనే పదానికి దూరమైన విరాట్ కోహ్లీ ఇక టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ చేశాడు అని చెప్పాలి. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇప్పటికే వన్డే టి20 ఫార్మట్ లో సెంచరీ చేసి మునుపటి ఫామ్ లోకి వచ్చాను అని నిరూపించిన కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం వరుసగా విఫలం అవుతుంది నిరాశపరిచాడు.

 అంతకు ముందు జరిగిన మూడు మ్యాచ్లలో విఫలమైన విరాట్ కోహ్లీ ఇక నాలుగో మ్యాచ్ కూడా  గొప్ప ప్రదర్శన చేస్తాడు అని అభిమానులు కూడా అంచనాలు పెట్టుకోలేదు.  కానీ హాఫ్ సెంచరీ  పూర్తి చేసిన తర్వాత కోహ్లీ సెంచరీ చేస్తే బాగుండు అని కోరుకున్నారు. అనుకున్నట్లుగానే సెంచరీ చేసేసాడు. డబుల్ సెంచరీ కూడా చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఇక డబుల్ సెంచరీకి కొన్ని పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. ఏకంగా 106 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.

 అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు అని ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయిన నేపథ్యంలో  కోహ్లీ అభిమానులు అందరూ గర్వపడే మరో విషయాన్ని అతని భార్య అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. కోహ్లీ నాలుగో టెస్ట్ లో బ్యాటింగ్  కి దిగడానికి ముందు తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడట. అయితే జ్వరంతోనే ఇలా బ్యాటింగ్ కి వచ్చాడట విరాట్ కోహ్లీ. ఒకవైపు జ్వరం ఉన్నప్పటికీ ఇక జట్టును గెలిపించడం కోసం ఏకంగా 186 పరుగుల వరకు మైదానంలో పోరాడుతూనే ఉన్నాడు కోహ్లీ. ఈ విషయం తెలిసి నిజంగా నువ్వు గ్రేట్ కోహ్లీ.. జట్టును గెలిపించేందుకు ఏమైనా చేస్తావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: