ఒకప్పుడు కోహ్లీ అభిమానిగా.. ఇప్పుడు ఏకంగా కోహ్లీ జట్టులో ప్లేయర్గా?

praveen
ఇండియాలో క్రికెట్కు ఉన్న పిచ్చి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ప్రేక్షకులందరూ ఒక్కసారి తమ అభిమాని క్రికెటర్లను కలిస్తే చాలు జీవితం ధన్యమైపోయినట్లే అని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక తమ అభిమాన క్రికెటర్లను స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది క్రికెట్ ని ప్రొఫెషన్ గా ఎంచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి వారిలో భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ కూడా ఒకరు అని చెప్పాలి. చిన్నప్పటినుంచి విరాట్ కోహ్లీ అభిమానిస్తుంది శ్రేయాంక పాటిల్. అతని ఆట తీరుని చూస్తూనే పెరిగింది.

 ఇక విరాట్ మ్యాచ్ ఆడుతున్నాడు అంటే చాలు ఎక్కడికైనా వెళ్లి మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండేది. ఇక విరాట్ కోహ్లీని కలిసి ఒక్క ఫోటో దిగితే చాలు అని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసింది. ఒక్కసారి ఇలా విరాట్ కోహ్లీతో ఫోటో కూడా దిగింది. అయితే ఇలా విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన శ్రేయాంక ఇక ఇప్పుడు కోహ్లీ జట్టుగా పేరు ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతూ ఉండడం గమనార్హం. ఇటీవల తన ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ను షేర్ చేసుకుంది. చిన్నప్పుడు విరాట్ కోహ్లీతో దిగిన ఫోటోలు ఇక ఇప్పుడు ఆర్ సి బి లో ఉన్న ఫోటోని షేర్ చేసింది శ్రేయాంక పాటిల్.

 నా ఫోన్ తీసుకొని నాతో ఒక ఫోటో దిగాడు కోహ్లీ. నా చేతిని తాకాడు అనే విషయం ఇప్పటికే చెప్పాలనుకుంటున్న.. నేను స్కూల్ కి వెళ్లిన విరాట్ కోహ్లీ నన్ను తాకాడనే విషయం గుర్తొచ్చేది. ఆ అనుభూతి చాలా బాగుంది. అతనితో కలిసి ఫోటో దిగడం ఎంతో బాగుంది అని శ్రేయాంక పాటిల్ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు కోహ్లీని వ్యక్తిగతంగా కలవలేదు అంటూ తెలిపింది. కానీ అతనితో ఫోటో దిగడం మాత్రం నాకు చాలా పెద్ద విషయం అంటూ తెలిపింది. కోహ్లీతో దిగిన ఫోటోని మా ఇంట్లో పెద్ద ఫ్రేమ్ చేసి కట్టించుకున్నాను. ఇక కోహ్లీని కలిసినప్పుడు ఆ ఫ్రేమ్ పై ఆటోగ్రాఫ్ తీసుకుంటాను అంటూ శ్రేయాంక పాటిల్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: