అలాంటి చెత్త పనులు చేయాలి.. అందుకే జబర్దస్త్ వదిలేసా : అనసూయ

praveen
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నిలదొక్కుకోవాలని ఆశపడిన ఎంతోమందికి ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ అనే కార్యక్రమం కొత్త జీవితాన్ని ప్రసాదించింది అని చెప్పాలి. ముక్కు ముఖం తెలియని వారిని సైతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలిసేలా చేసింది. అంతేకాదు తినడానికి తిండి కూడా లేక అల్లాడిపోతున్న వారికి ఇక ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు తినే స్టేజ్ కి తీసుకువచ్చింది అని చెప్పాలి. ఇక ఇలా జబర్దస్త్ ద్వారా స్టార్ గా ఎదిగిన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.

 అందరిలాగానే ఇండస్ట్రీలో రాణించాలనే కోరికతో అనసూయ వచ్చింది. కానీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అవకాశాలు దక్కించుకోవడం అంత సులభం కాదు అని తెలుసుకొని యాంకర్ అవతారం ఎత్తింది. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ షో ద్వారా తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది.  ఇక ఈ షో ద్వారా అనసూయకు ఊహించని సక్సెస్ వచ్చింది. ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఇక ఆ తర్వాత వెండితెరపై కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంది. అయితే 2022లో అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పి అందరికీ ట్విస్ట్ ఇచ్చింది.

 అయితే జబర్దస్త్ లో ఉన్నన్నాళ్ళు కామ్ గానే ఉన్న అనసూయ.. ఇక ఇప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మాత్రం తనను స్టార్ గా మార్చిన షో మీదే షాకింగ్ ఆరోపణలు చేస్తుంది. ఇక ఇటీవల అనసూయ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి. ఫ్యాన్స్ తో ఆన్లైన్ చిట్ చాట్ చేస్తున్న సమయంలో యాంకరింగ్ ఎందుకు మానేశారు అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించాడు. బుల్లితెర షోల నిర్వాహకులు అవమానకర రీతిలో చెత్త టిఆర్పి స్టంట్స్ కి పాల్పడుతూ ఉంటారు. ప్రస్తుతం టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో అనారోగ్య వాతావరణం ఉంది. ఇక ఇలాంటి వాతావరణం లేని రోజు మళ్ళీ యాంకరింగ్ చేస్తాను అంటూ కామెంట్ చేసింది. పరోక్షంగా జబర్దస్త్ లో నిర్వాహకులు చేసే టిఆర్పి స్టంట్స్ నచ్చకనే ఇక యాంకరింగ్ మానేసాను అని చెప్పకనే చెప్పింది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: