ఓటమి కోరల్లో ఇండియా... చేతులెత్తేసిన కీ ప్లేయర్స్ !

VAMSI
ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇండియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగా నాలుగు టెస్ట్ లు మరియు మూడు వన్ డే లు ఆడనుంది. ఇప్పటికే రెండు టెస్ట్ లు పూర్తి కాగా, ఇండియా 2-0 తో ఆధిక్యంలో ఉంది... రెండు మ్యాచ్ లలో మరో టెస్ట్ ను గెలుచుకుంటే సీరిస్ ను దక్కించుకుంటుంది. అయితే ఇది సాధ్యం అవుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఇండియా అభిమానిలో మొదలైంది అని చెప్పాలి. ఎందుకంటే ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ లో ఇండియా దారుణంగా ఆడుతోంది. ఫలితంగా ఓటమికి చాలా దగ్గరైంది. రోహిత్ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత బ్యాట్స్మన్ పూర్తిగా తేలిపోయారు...
కొత్త బౌలర్ మాథ్యూ కునేమాన్ దెబ్బకు కేవలం 109 పరుగులకు ఆల్ ఔట్ అయింది. మూకుమ్మడిగా అందరూ ఔట్ అవ్వడమే ఇంత దారుణ వైఫల్యానికి కారణం అని చెప్పాలి. అయితే బ్యాటింగ్ లో ఫెయిల్ అయినా ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్ లో 197 పరుగులకు కట్టడి చేసి కాస్త మ్యాచ్ పై నమ్మకాన్ని కలిగించారు. కానీ రెండవ ఇన్నింగ్స్ లోనూ ఇండియా ఆటగాళ్ళు అదే ఆటతీరును కనబరిచి మొదటి ఇన్నింగ్స్ కన్నా మరో 54 పరుగులు ఎక్కువగా జోడించి 163 పరుగులకు ఆల్ ఔట్ అయింది. ఈ స్కోర్ లో పుజారా ఒక్కడే 59 పరుగులు చేసి ఇండియాకు ఆ మాత్రం స్కోర్ అయినా రావడంలో సహాయపడ్డాడు.
ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఇండియాను ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ నాథన్ లయాన్ గడగడలాడించాడు. ఏకంగా ఇతను పది వికెట్లలో 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా రెండు ఇన్నింగ్స్ ల అనంతరం ఇండియా కేవలం 75 పరుగులు లీడ్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఈ టెస్ట్ లో ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా 76 పరుగులు చేస్తే మూడవ టెస్ట్ ను కైవసం చేసుకుంటుంది. మరి కాసేపట్లో మొదలు కానున్న మూడవ రోజు మొదటి సెషన్ లో ఇండియా బౌలర్లు రాణిస్తే ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయా ? లేదా మూడవ టెస్ట్ ను ఆస్ట్రేలియాకు అప్పగిస్తారా అన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: