చెప్పి మరి సెంచరీ కొట్టాడు.. అందుకే హిట్ మ్యాన్ అయ్యాడు?
ఇక మైదానంలోకి ఓపెనర్ గా బరిలోకి దిగుతూ మంచి షాట్లతో పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇక మంచి షాట్లు ఆడుతున్న రోహిత్ శర్మ అంతలోనే వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరుతున్నాడు. అయితే ఇక రోహిత్ కు సమవుజ్జి అయిన అతని సహచరుడు కోహ్లీ మాత్రం మునుపడి ఫామ్ అందుకుని సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. దీంతో ఇక వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ బ్యాట్ నుంచి సెంచరీ ఎప్పుడు వస్తుందా అని ఎంతో మంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ఇక అందరికీ చెప్పి మరి సెంచరీ కొట్టాడు రోహిత్ శర్మ.
ఆందోళన వద్దని.. భారీ స్కోర్ బాకీ ఉందన్న విషయం నాకు తెలుసు అని.. త్వరలోనే శతకం కొడతా అంటూ సరిగ్గా మూడో మ్యాచ్ జరగడానికి రెండు రోజుల ముందు మీడియా సమావేశంలో మాటిచ్చాడు రోహిత్. ఇక ఇచ్చిన మాటను మూడో వన్డే మ్యాచ్లో నిలబెట్టుకున్నాడు అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి అందని ద్రాక్షల రోహిత్ ను వేదిస్తున్న సెంచరీని ఇటీవల అందుకున్నాడు రోహిత్ శర్మ. 2020 లో జనవరి 19న ఆస్ట్రేలియాపై చివరిసారిగా వన్డే ఫార్మాట్లో సెంచరీ ఆడిన రోహిత్ శర్మ మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. 83 బంతుల్లో 100 పరుగులు మార్కులు అందుకున్నాడు.. అయితే ఇలా రోహిత్ చెప్పి మరి సెంచరీ కొట్టడం వల్లే.. హిట్ మ్యాన్ అని బిరుదు సంపాదించాడు అని అభిమానులు అంటున్నారు.