విజయ్ శంకర్ సెంచరీ.. అంబటి రాయుడు 3d పోస్ట్ వైరల్?
రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడు తరఫున బరిలోకి దిగిన విజయ్ శంకర్ ఇటీవలే పూణే వేదికగా మహారాష్ట్ర, తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్లో కూడా వరుసగా రెండో సెంచరీ సాధించాడు అని చెప్పాలి. ఇక అంతకు ముందు ముంబై తో జరిగిన మ్యాచ్లో కూడా 214 బంతుల్లో 10 ఫోర్ ల సహాయంతో 107 పరుగులు చేశాడు విజయ శంకర్. ఇక ఇలా విజయ శంకర్ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో టీమిండియా వెటరన్ ప్లేయర్ అయిన అంబటి రాయుడు పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.
గతంలో 2019 వరల్డ్ కప్ సమయంలో అంబటి రాయుడుకు బదులు ఇక విజయ శంకర్ ను ఎంపిక చేశాడు అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్. అప్పట్లో ఇది కాస్త అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక విజయ శంకర్ బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్లో రాణిస్తాడని అతను 3d ప్లేయర్ అంటూ ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ తర్వాత ఇక ఇదే కామెంట్స్ పై కౌంటర్ ఇస్తూ త్రీడి గ్లాసెస్ పెట్టుకొని నేను మ్యాచ్ చూస్తా అంబటి రాయుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీంతో ఇక ఇప్పుడు విజయ శంకర్ సెంచరీ చేసిన నేపథ్యంలో 3d ప్లేయర్ అనే పోస్ట్ కాస్త మరోసారి వైరల్ గా మారింది అని చెప్పాలి.