IND vs SL 2nd ODI: విరాట్, రోహిత్ .. ఆ రికార్డులు ఖాయం?

Purushottham Vinay
ఇండియా ఇంకా శ్రీ లంక వన్డే సిరీస్‌లో భాగంగా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో మ్యాచ్ జరుగుతోంది.ఇక ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి టీం అయిన శ్రీలంక టీం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ని ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బౌలింగ్ చేస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంకతో టీమిండియా వరుసగా పదో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. గత 26 సంవత్సరాలుగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఇండియన్ టీం ఎప్పుడు కూడా ఓడిపోలేదు.చివరి ఓటమి 1997 వ సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత వరుసగా టీమిండియా తన జైత్రయాత్రని కొనసాగిస్తూనే ఉంది.ఇక ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును కూడా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇక్కడ తన తుఫాన్ బ్యాటింగ్‌ను కొనసాగించే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ పిచ్ లో రోహిత్ వన్డేల్లో అతిపెద్ద వ్యక్తిగత ఇన్నింగ్స్‌ని ఆడాడు.2014 నవంబర్‌ నెలలో ఇక్కడ శ్రీలంకపై రోహిత్ ఏకంగా 264 పరుగులు చేశాడు.ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీ శ్రీలంకపై టాప్ స్కోరర్‌గా నిలచే ఛాన్స్ కూడా ఉంది.


ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ శ్రీలంకపై టాప్-2 స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం మొత్తం 2,333 పరుగులతో మూడో స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ (3,113 పరుగులు) మొదటి స్థానంలో ఉండగా మహేంద్ర సింగ్ ధోని (2,383 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. అయితే 51వ పరుగు చేసిన వెంటనే విరాట్ రెండో స్థానంలోకి వచ్చేస్తాడు.మరి చూడాలి కోహ్లీ ఆ రికార్డ్ సృష్టిస్తాడో లేదో..ఇక శ్రీలంక జట్టు విషయానికి వస్తే..అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుసల్ మెండిస్ (కీపర్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే ఇంకా దునిత్ వెల్లలాగే, లహిరు కుమార అలాగే కసున్ రజిత ఆడుతున్నారు.ఇక భారత్ జట్టు విషయానికి వస్తే..రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇంకా మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ ఇంకా అలాగే మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: