బోరున ఏడ్చిన అభిమాని.. రోహిత్ ఏం చేశాడో చూడండి?

praveen
సాధారణంగా భారత్లో క్రికెటర్లను ప్రేక్షకులు ఎంతల ఆరాధిస్తుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది అభిమానులు అయితే ఏకంగా స్టార్ క్రికెటర్లను దేవుళ్ళ లాగా భావిస్తూ ఆరాధించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక తమ అభిమాన క్రికెటర్ ని లైఫ్ లో ఒక్కసారి కలిసిన చాలు అని భావిస్తూ ఉంటారు. ఇందుకోసం కొంతమంది అభిమానులు అయితే కాస్త రిస్క్ చేస్తూ ఉంటారు. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి పరుగులు పెడుతూ తమ అభిమాన క్రికెటర్ల ను హాగ్ చేసుకోవడం లేదా షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి చేసి ఇక మళ్ళీ మైదానం బయటికి పరుగులు పెట్టడం లాంటి ఘటనలు ఎన్నోసార్లు చూశాం.

 ఇక కొన్ని కొన్ని సార్లు తమ అభిమానక క్రికెటర్ల దృష్టిని తమ వైపుకు  ఆకర్షించేందుకు రకరకాల ప్లకార్డులు  ప్రదర్శించడం లేదా నినాదాలు చేయడం లాంటివి కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఒక అభిమాని స్టార్ క్రికెటర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. శ్రీలంకతో భారత్ నేటి నుంచి వన్డే సిరీస్ ఆడబోతుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు మీడియా సమావేశం ముగించుకుని రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలోనే అక్కడ గుమ్మిగూడిన అభిమానులను రోహిత్ పలకరించే ప్రయత్నం చేశాడు.

 ఇంతలో ఓ అభిమాని రోహిత్ ని చూసి బోరున ఏడ్చేసాడు. ఇక దీనిని గమనించిన రోహిత్ శర్మ ఆ అభిమాని దగ్గరికి వెళ్లి అతని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఏకంగా చెంపలు గిల్లుతూ  దగ్గరికి తీసుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావ్.. ఏడవకూడదు అంటూ ఓదార్చాడు.  అయితే ఆ సమయంలో ఇక ఎంతోమంది అభిమానులు కూడా రోహిత్ శర్మ తమకు దగ్గరగా రావడంతో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు అని చెప్పాలి.  ఇకపోతే శ్రీలంకతో ఇప్పటికే 2-1 తేడాతో టి20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా.. నేటి నుంచి వన్డే సిరీస్ ఆడపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: