టీమిండియాలోకి కొత్త కేఎల్ రాహుల్.. నెటిజన్స్ ట్రోల్స్?

praveen
కొత్త ఏడాదిలో టీమిండియా శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా 2-1 తేడాతో సిరీస్ ను కైవాసం చేసుకుని మరోసారి తమ విజయాల పరంపరను కొనసాగించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే టీమిండియా  అటు సిరీస్ కైవసం అయితే చేసుకుంది. కానీ ఇక టీమిండియాలో పలువురు ఆటగాళ్ల ప్రదర్శన పై మాత్రం విమర్శలు వస్తూ ఉన్నాయి. భారీ అంచనాల మధ్య టి20 జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు అంచనాలను అందుకోలేక ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు.

 గత కొంతకాలం నుంచి కేఎల్ రాహుల్ పేలవమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు . దంచి కొట్టాల్సిన పొట్టి ఫార్మాట్లో ఏకంగా మేడిన్ ఓవర్లు కూడా ఆడేస్తూ అభిమానులందరికీ కూడా చిరాకు తెప్పిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ పెళ్లి కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కాగా ఇక ప్రస్తుతం టీమిండియాలోకి కొత్త కేఎల్ రాహుల్  వచ్చేసాడు అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇలా కామెంట్ చేయడం వెనక పెద్ద కారణమే ఉంది. ఇప్పటికే వన్డే, టెస్ట్ ఫార్మట్ లో టీమిండియా తరఫున అదరగొట్టిన శుభమన్ గిల్ శ్రీలంకతో టి20 సిరీస్ లో పొట్టి ఫార్మాట్లో కూడా అడుగు పెట్టాడు.

 శుభమన్ గిల్ అదరగొడతాడని అందరూ భావించారు. కానీ ఇటీవల శ్రీలంక పేసర్ రజిత వేసిన రెండో ఓవర్ ను శుభమన్ గిల్ మేడిన్ చేశాడు.  సింగిల్ తీయడానికి కూడా ఇబ్బంది పడిపోయాడు. ఏకంగా ఒక్క ఓవర్ మాత్రమే కాదు మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. ఇక పదో బంతికి సిక్స్ కొట్టి ఖాతా తెరిచాడు అని చెప్పాలి. 36 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతను నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో చేయాలి కేఎల్ రాహుల్  ఇలాగే టి20 లలో మేడిన్ ఓవర్ ఆడాడు. ఇక ఇప్పుడు శుభమన్ గిల్ కూడా ఇదే చేశాడు. దీంతో టీమ్ ఇండియాలోకి కొత్త కేఎల్ రాహుల్ వచ్చాడు అంటూ  కామెంట్లు చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: