కొత్త ఏడాదిలో మొదటి రోజే.. సూర్య ఆసక్తికర పోస్ట్?

praveen
2022 ఏడాది అటు టీమ్ ఇండియాకు అసలు కలిసి రాలేదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే 2022 ఏడాదిలో టీమిండియా అటు ద్వైపాక్షిక సిరీస్లలో పరవాలేదు అనిపించినప్పటికీ మెగా టోర్నిలు అయినా ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది అన్న విషయం తెలిసిందే  టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. అయితే టీమ్ ఇండియాకు 2022 ఏడాది కలిసి రాకపోయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ కి మాత్రం గత ఏడాది అతని కెరియర్ లోనే బెస్ట్ ఇయర్ గా మారిపోయింది.

 గత ఏడాది మొత్తం తన అద్భుతమైన ప్రదర్శన తో అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్ ఏకంగా టీమ్ ఇండియా తరఫున కీలకమైన బ్యాట్స్మెన్ గా అవతరించాడు. ఆసియా కప్, టి20 వరల్డ్ కప్లలో కూడా తన బ్యాట్ ఝలిపించి తిరుగులేదు అని నిరూపించాడు. అంతేకాదు ఇక టి20 ఫార్మాట్ లో అసమాన్యమైన బ్యాటింగ్ తీరుతో ఏకంగా ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా 2022 ఏడాది మొత్తం సూర్య కుమార్ దే అన్న విధంగా సాగింది అతని ప్రస్థానం.

 ఈ క్రమంలోని 2023 లో కూడా అతని విధ్వంసం కొనసాగుతుందని అభిమానులు అందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఇటీవల సూర్య కుమార్ యాదవ్ నూతన సంవత్సర వేడుకలను తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే కొత్త సంవత్సరం తొలి రోజున ఒక ఆసక్తికర పోస్టు పెట్టాడు. ముంబైలోని ప్రఖ్యాతి సిద్ధి వినాయక గుడిని సందర్శించి దీవెనలు అందుకున్నాడు సూర్యకుమార్. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరుకున్న అంటూ క్యాప్షన్ జోడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: