టీమిండియా ఓటమి.. రమిజ్ రజా సెటైర్.. ఏమన్నాడో తెలుసా?

praveen
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో భాగంగా అందరి అంచనాలను తారుమారు చేసే ఫలితాలు వెలువడ్డాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంటికి వెళుతుంది అనుకున్న జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తే ఇక కప్పు కొడతాయి అనుకున్న జట్లు మాత్రం చివరికి పేలవమైన ప్రదర్శనతో ఇంటిదారి పట్టాయి అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి జట్లలో పాకిస్తాన్ కూడా ఒకటి. పాకిస్తాన్ వరుసగా రెండు ఓటములు చవిచూడటంతో ఇకసెమి ఫైనల్ అడుగు పెట్టడం చాలా కష్టమని అందరూ భావించారు. కానీ ఎందుకో అదృష్టం మాత్రం పాకిస్తాన్ జట్టుకు బాగా కలిసి వచ్చింది.

 నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడంతో సెమీఫైనల్ అడుగుపెట్టిన పాకిస్తాన్ ఇక సెమీఫైనల్ లో మాత్రం అద్భుతమైన ఆటతీరుతో న్యూజిలాండ్ ను మట్టి కరిపించి ఇక ఇప్పుడు ఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలబడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇక కప్పు గెలుస్తుంది అనుకున్న భారథ్ మాత్రం సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలోనే ఇండియా పై విమర్శలు చేయడానికి ఎప్పుడూ ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూసే పాక్ మాజీ ఆటగాళ్లు టీమిండియా సెమిస్ లో ఓడటాన్ని టార్గెట్ గా చేసుకుంటూ ఎన్నో విమర్శలు చేస్తున్నారు.

 ఇక పాకిస్తాన్ ఫైనల్ కు చేరడం అటు టీమిండియా సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టిన నేపథ్యంలో ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమిజ్ రజా మరోసారి టీమిండియా పై విషం చిమ్మాడు. భారత జట్టును బీసీసీఐ ని కూడా హేళన చేస్తూ మాట్లాడాడు. పాకిస్తాన్ జట్టుపై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళకి ఇప్పుడు సమాధానం దొరికింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు  అదే సమయంలో బిలియన్ డాలర్ల టీం ఇంటికి వెళుతుంది అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశాడు రమిజ్ రజా. గత నెలలోనే ముగ్గురు ప్లేయర్లు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో ఉన్నారు.. పాకిస్తాన్ క్రికెట్ గొప్పతనం గురించి చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ సొంత డబ్బా కొట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: