ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి ముందు.. అడవి బాట పట్టిన టీమిండియా క్రికెటర్?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇక సూపర్ 12 లో భాగంగా ఐదు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించి గ్రూప్2 నుంచి టాప్ ప్లేస్ లో నిలిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో కాలు పెట్టింది   ఇక సెమి ఫైనల్లో భాగంగా రేపు ఇంగ్లాండుతో అమితుని తేల్చుకోవడానికి సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే సాధారణంగానే వరల్డ్ కప్ అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు ఇక  ఆటగాళ్లు మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు తమకు ఇష్టమైన పనులు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇక ఇటీవల ఖాళీ సమయాన్ని సరదాగా గడిపేందుకు కేటాయించాడు. ఎప్పుడు అడ్వెంచర్ ప్రయాణాలను బాగా ఇష్టపడే షమి కాలి సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న అడవుల్లోకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించడం అలవాటు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో మ్యాచ్కి ముందు కాస్త కాళీ సమయం దొరకడంతో తమ హోటల్ కి దగ్గరగా ఉన్న ఆస్ట్రేలియా  అడవుల్లో చక్కర్లు కొట్టిన షమి ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

 అడవిలో వైఫై కనెక్షన్ ఉండకపోవచ్చు. కానీ మీకు బెస్ట్ కనెక్షన్ దొరుకుతుంది.. నేను ప్రామిస్ చేయగలను అంటూ ఒక కామెంట్ కూడా రాసుకోచ్చాడు.. ఇకపోతే టీమ్ ఇండియాలో బుమ్రా స్థానంలో అవకాశం దక్కించుకున్న షమి అంచనాలకు మించి రాణిస్తున్నాడు.  తక్కువ పరుగులకే బ్యాట్స్మెన్లను కట్టడం చేయడమే కాదు ఇప్పటివరకు ఐదు మ్యాచ్లలో ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు అని చెప్పాలి.  హార్దిక్ పాండ్యాతో కలిసి మిడిల్ ఓవర్లలో తన బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తున్నాడు షమి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: