ఐపీఎల్ 2022: మారని హైద్రాబాద్... కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫెయిల్యూర్ ?
రాయల్స్ ఆటగాళ్లలో శాంసన్, పడిక్కల్, హెట్ మైర్ లు రాణించారు. అయితే కెప్టెన్ కేన్ తనకున్న బౌలర్ లను సరిగా వాడుకోవడంలో విఫలం అయ్యాడని చెప్పాలి. రాయల్స్ బ్యాట్స్మన్ దూకుడుకు కళ్లెం వేయలేక ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు. ఒక్కసారిగా ఈ లక్ష్యం చూస్తే సన్ రైజర్స్ చేధించడం కాదు కదా, కనీసం 150 చేసినా గొప్పే అనుకున్నారు అంతా, ఎందుకంటే రాయల్స్ బౌలింగ్ ఎటాక్ దుర్భేధ్యంగా ఉంది. ఊహించిన విధంగానే సన్ రైజర్స్ బ్యాట్స్మన్ అంతా రాజస్థాన్ బౌలింగ్ దెబ్బకు తోక ముడిచారు. ఎప్పుడైనా భారీ లక్ష్యాన్ని చేదించాలంటే మొదటి నుండి వికెట్ కాపాడుకుంటూ దూకుడుగా ఆడాలి. కానీ 15 ఓవర్ ల వరకు సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎలా సాగింది అంటే, వన్ డే మ్యాచ్ కన్నా దారుణంగా సాగింది.
ఓపెనర్లు విలియం సన్ మరియు అభిషేక్ శర్మ లు ఫెయిల్ అయ్యారు. తర్వాత వచ్చిన త్రిపాఠి మరియు పూరన్ లు డక్ ఔట్ గా వెనుతిరిగారు. ఆఖర్లో మార్ క్రామ్ మరియు వాషింగ్టన్ సుందర్ లు దూకుడుగా ఆడడంతో కనీసం 149 పరుగులు అయినా చేయగలిగింది. లేదంటే 100 కు లోపే పరిమితం అయి ఉండేది. ముఖ్యంగా రాజస్థాన్ బౌలర్లు ప్రసిద్ధ కృష్ణ, బౌల్ట్ మరియు చహల్ ల దాటికి విలవిలలాడిపోయింది సన్ రైజర్స్. దీనితో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 61 పరుగుల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. కొత్త సీజన్ లో ఘనంగా తన వైభవాన్ని చాటుతుంది అని భావించిన అభిమానులను మరియు జట్టు యాజమాన్యాన్ని తీవ్రంగా నిరాశపరిచాడు కెప్టెన్ కేన్ విలియంసన్. కేన్ లో మునుపటి వాడి అయితే కనిపించలేదు అని చెప్పాలి. అటు ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపలేక, ఇటు ఓపెనర్ గా వచ్చి జట్టును ఆదుకోలేక అన్ని విధాలుగా కేన్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. మరి చూద్దాం ముందు ముందు అయినా కేన్ అండ్ టీమ్ పుంజుకుంటుందా?