పూణే వేదికగా శుక్రవారం శ్రీలంక తో జరిగిన మూడో టీ 20 లో భారత్ 78రన్స్ తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. చివరి టీ 20 లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాహుల్(54),ధావన్ (52) మనీష్ పాండే (31*)రాణించగా చివర్లో శార్దూల్ ఠాకూర్(22*) 8బంతుల్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ తో మెరుపులు మెరిపించాడు.
అనంతరం భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన శ్రీలంక 15.5ఓవర్ల లోనే 123పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాట్స్ మెన్ లలో ధనంజయ డిసిల్వా (57), మాథ్యూస్ (31) మాత్రమే రెండకెల స్కోర్ చేయగలిగారు. భారత బౌలర్ల లో సైనీ 3,శార్దూల్ ఠాకూర్ 2, సుందర్ 2వికెట్లు తీయగా బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక శార్దూల్ ఠాకూర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా రెండు టీ 20ల్లో 7.5ఓవర్లలో 46రన్స్ ఇచ్చి 5వికెట్లు తీసిన సైనీని మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. కాగా మూడు మ్యాచ్ ల ఈ టీ 20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.