యువజన శ్రామిక రైతు పార్టీ : వైసీపీ ఆంధ్రపప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడేటటువంటి విజయాన్ని సొంతం చేసుకునే దిశగా కొనసాగు తుంది. దాదాపు 50% పైగా ఓట్ల మెజార్టీతో తండ్రి వైయస్సార్ గారు కూడా సాధించనంత గొప్ప భారీ ప్రజాభిమానాన్ని సంపాదించుకోవడం అంటే నేటి రాజకీయాల్లో.. అందునా చంద్రబాబు వంటి ప్రత్యర్థి మీద.. తమాషా కాదు, అషామాషీ అంతకంటే కాదు.
అందుకే అంటారు తన కష్టమే తనకు మిత్రుడని..కష్టేఫలి అని, వైసీపీ - జగన్ గారి పోరాటపటిమ రానున్న తరాల తెలుగు యువతకు ఆదర్శప్రాయం.
వ్యూహాలు అంటే మన కష్టాన్ని మెరుగయిన దారిలో ఉపయోగించుకోవడమే., మన కష్టం నుంచి ఇంకా ఎక్కువ ఫలితం రాబట్టుకోవడమే అంతే కానీ మరెవరినో దోచుకొని-మనం దాచుకోవడం కాదు అనే భావన మెరుగు పడటానికి ఈ గెలుపు బాట వేస్తుందనడంలో సందేహం లేదు.
2019 ఎన్నికల ఫలితాలను క్షణ-క్షణానికి తాజాగా వార్తలను మీ ముందుకు తీసుకొస్తాము ఇండియాహెరాల్డ్ గ్రూప్.
ప్రస్తుతం లీడ్ : వైసీపీ : 150, తేదేపా : 24, ఎన్డీయే : 335, యూపీఏ : 99