ఎట్టకేలకు దిగివచ్చి దళితులకు క్షమాపణలు చెప్పిన చింతమనేని..!
దీంతో పరిస్థితి అదుపు తప్పుతున్న క్రమంలో దళితులను దూషించిన టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కండిషన్ లతో కూడిన క్షమాపణ చెప్పారు.వీడియోని పూర్తిగా చూడకుండా తనను తప్పుగా అర్దం చేసుకున్నవారికి క్షమాపణలు చెబుతున్నానని ఆయన తెలిపారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనను దోషిగా నిలబెట్టడానికి కుట్ర జరిగిందని ఆయన అన్నారు. ఈ విషయంలో తనపై దుష్ప్రచారం చేసిన సాక్షి మీడియాపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.నిజంగానే నేను తప్పుగా మాట్లాడితే అక్కడున్న వారంతా చప్పట్లు, ఈలల ఎందుకు వేశారని ప్రశ్నించారు. తాను తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు.