కేరళ రాష్ట్రం గురించి తన ఆవేదన వ్యక్తం చేసిన జగన్..!
పాదయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలో ఇటీవల అడుగుపెట్టిన జగన్ కేరళ రాష్ట్రంలో ప్రకృతి చేసిన ఘోరాన్ని చూసి తన విచారాన్ని వ్యక్తం చేశారు. కేరళలో వరద భీభత్సం చూస్తుంటే హృదయం కలచివేస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ కష్ట కాలంలో తనప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయన్నారు. విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. భారీ వర్షాలు, వరదలతో కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
మరోపక్క కుండపోత వర్షం మాత్రం ఆగడం లేదు..పరిస్థితి ఇలానే ఉంటే కేరళ రాష్ట్ర ప్రజలు చాలా దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు వాతావరణ నిపుణులు. మరోపక్క దేశప్రజలందరూ కేరళ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని ప్రార్థనలు చేయాలని తమతమ దేవుళ్లకు మొక్కు కోవాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రార్థిస్తున్నారు.