ఎన్నికల ముందు ఏదైనా జరగొచ్చు అంటున్న కన్నా లక్ష్మీనారాయణ…!

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన కామెంట్లు చేశారు. తాజాగా ఇటీవల విజయవాడ నగరంలో బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు గురించి చంద్రబాబు పై సంచలన కామెంట్ చేశారు.  ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి ఆంధ్రాకు వచ్చారని అన్నారు.


అంతేకాకుండా 1500 రోజుల పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప మరేం లేవని అన్నారు. ఇన్ని రోజుల్లో కనీసం 15 ప్రాజెక్టులు కూడా నిర్మించలేకపోయారన్నారు. అనుభవజ్ఞుడని నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబడితే అవినీతి పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుకు భయపడే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన వేల కోట్ల రూపాయలను చంద్రబాబు అడగడం లేదని కన్నా విమర్శించారు.


ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై బురద చల్లాలని ఆనాడు ప్రత్యేక ప్యాకేజీ కి ఒప్పుకుని ప్రస్తుతం ప్రత్యేక హోదా కావాలంటు చంద్రబాబు దొంగనాటకాలు ఆడటానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగు పడాలని కేంద్రం ఎన్నో నిధులు ఇస్తే చంద్రబాబు వాటిని రాష్ట్రాభివృద్ధికి వాడకుండా తన ఖజానా నింపుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు కన్నా.


ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ నాయకుల పై జరుగుతున్న దాడిని కేంద్రంలో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని...మరి ఎన్నికల ముందు ఎవరికి ఎటువంటి షాక్ తగులుతుందో ఎవరికీ తెలియదని సంచలన కామెంట్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: