సెన్సేషన్ : పెద్దలకు అమ్మాయిలను సప్లై చేస్తున్న లేడీ ప్రొఫెసర్..!!

Vasishta

తమిళనాడులో ఓ  లేడీ ప్రొఫెసర్ పెద్దలకు అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ గా మారింది. విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన ఆమె పెద్దలకు పరుపులు పరిచేందుకు సిద్ధమైంది. అందుకు కొంతమంది విద్యార్ధినులకు డబ్బు ఎరచూపి.. ఒప్పించేందుకు ఒత్తిడి తెచ్చింది. విద్యార్ధినులతో లేడీ బ్రోకర్ మాట్లాడిన ఆడియో టేపులు వైరల్ కావడంతో సదరు ప్రొఫెసర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో ఉన్న పెద్ద వాళ్లను బయటకు లాగేందుకు సీబీఐ విచారణ వేయాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు.


తమిళనాడు అరుప్పుకోటైలోని దేవాంగర్ ఆర్ట్స్ కాలేజీలో నిర్మలాదేవి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పెద్దలకు కోరికలు తీర్చమని తన విద్యార్ధులపై ఒత్తిడి తీసుకొచ్చి.. కటకటాల వెనక్కి వెళ్లింది. విద్యార్ధులను లైంగిక కార్యకలాపాలకోసం ప్రేరింపించిన ఆడియో టేపులు బయటపడడంతో నిర్మలాదేవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బ్రోకర్ పని చేస్తున్న నిర్మలా దేవిని కాలేజీ యాజమాన్యం.. సస్పెండ్ చేసింది. అయితే ఆమెను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెక్స్ పాఠాలు చెప్పిన నిర్మలా దేవి వ్యవహారంలో లోతుగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆదేశాలు జారీ చేశారు.


15 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న నిర్మలా దేవి కాలేజ్ అమ్మాయిలను వ్యభిచారం కూపంలోకి ఎంతమందిని దించారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అరుప్పుకోటై ఆర్డీఓ చెల్లప్ప, పోలీస్ ఇన్ స్పెక్టర్ బాలమురగను, తహసీల్దార్ కార్తికేయన్ లు.. విద్యార్థులు, తోటి అధ్యాపకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల విద్యార్థినిలతో సెల్ ఫోన్ లో మాట్లాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి మదురై కామరాజు యూనివర్శిటీ సీనియర్ అధికారులకు కాలేజ్ అమ్మాయిలు కావాలని, వారికి లైంగిక సుఖం ఇస్తే ప్రతిఫలంగా మీకు డబ్బుతో పాటు పరీక్షల్లో మంచి మార్కులు వేయిస్తానని నీచంగా మాట్లాడింది. ఆ ఆడియో టేపులు బయటకు రావడంతో మేడం బ్రోకర్ పురాణం బయటకొచ్చింది.


విద్యార్థినిలకు లైంగిక పాఠాలు చెప్పిన నిర్మలా దేవి తమిళనాడు పరువు తీశారని, ఈ వ్యవహారంలో ఆమె వెనుక ఉన్న పెద్దలను బయటకు లాగడానికి సీబీఐతో విచారణ చేయించాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే  స్టాలిన్ డిమాండ్ చేశారు. నిర్మలాదేవి లాంటి వ్యక్తులను నడిరోడ్డులో నిలబెట్టి ఎన్ కౌంటర్ చేయాలని, ఆమె మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జయకుమార్ హామీ ఇచ్చారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: