మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: తన గోతి తానే తవ్వుకున్న రేవంత్ రెడ్డి..!?
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ముఖ్యమంత్రి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించి, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలను కూడా ప్రచారంలో పాల్గొనేటట్లు చేశారు. పలు ప్రాంతాల్లో స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కొన్ని ప్రధాన ప్రాంతాల్లో హంగ్ పరిస్థితులు ఏర్పడటం, ముఖ్య నాయకుల స్వస్థలాల్లో కూడా పార్టీకి మిశ్రమ ఫలితాలు రావడం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు అనుకూల ఫలితాలు రావడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కొన్ని చోట్ల పొత్తుల సమస్యలు, స్థానిక రాజకీయ పరిస్థితులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూ ర్, ఆయన ఇన్చార్జ్గా ఉన్న మెదక్ పార్లమెంట్లోనూ కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందిం ది. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిచింది. డబ్బు మరియు ఇతర ప్రలోభాలపై ఆధారపడే రాజకీయ విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనం ఇవ్వవని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. కొందరు ఇక రేవంత్ రెడ్డి టైం దగ్గర పడిన్నట్లే అని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.