S-400 కాదు.. ఇక S-500 లోడింగ్... ఇండియాను తట్టుకోవడం పాకిస్తాన్ కు కష్టమే?

Veldandi Saikiran
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన ఇండియన్ ఆర్మీ... శాంతి చర్చలకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడంతో... రెండు దేశాల మధ్య యుద్ధం... ఆగిపోయింది. అయినప్పటికీ పాకిస్తాన్ రాత్రిపూట దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనా దాదాపు ఈ యుద్ధం ముగిసిందనే చెప్పవచ్చు.

 అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ తో పాటు అమెరికా దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ప్రధాని నరేంద్ర మోడీ. ఇకపై పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య వివాదం చోటు చేసుకుంటే మధ్యవర్తిత్వం చేయడానికి వీలు లేదన్నట్లుగా.. మోడీ మాట్లాడారు. ఇప్పుడంటే.. తాము శాంతించామని.. ఇకపై.. ఉగ్రవాదం పేరుతో రెచ్చిపోతే పాకిస్థాన్లో భూస్థాపితం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అను వాయిదాలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

 ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్ దుమ్ము దులిపేసామని పేర్కొన్నారు. అయినా కూడా వాళ్లకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. 21వ శతాబ్దం యుద్ధ వీధిలో మేకింగ్ ఇండియా ఆయుధాలు వినియోగించామని వివరించాడు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ యుద్ధాల యుగం కాదు... ఉగ్రవాదుల యుగం కూడా కాదు... కేవలం ఉగ్రవాదాన్ని మట్టికరిపించే యుగం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు.  కాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో... దానికి కారణం తానేనని ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ చురకలు అంటించారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: