
గెలుపు కోసం టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి అష్ట కష్టాలు..
ఈ ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి తాము తప్పుకుంటున్నట్టు వైసీపీ ఎప్పుడో ప్రకటించింది. అయితే అక్కడ వామపక్షాల తరఫున ఉపాధ్యాయ సంఘాలతో చాలా సన్నిహితంగా ఉండే ప్రస్తుత ఎమ్మెల్సీ ఏ. ఎస్. లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు . ఆయనకు రెండు జిల్లాలలోను దాదాపుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు .. వామపక్షాలకు చెందిన వివిధ కార్మిక ట్రేడ్ యూనియన్లతో మంచి సంబంధాలు ఉన్నాయి . ఆజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా .. ఆయన అందుబాటులో ఉంటారు.
అందుకే ఆయా సంఘాలకు చెందిన పట్టణంలో ఓట్లు అన్ని .. గంప గుత్తగా లక్ష్మణరావుకి పడే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు . దీనికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్న సమయంలో తమకు అనుకులంగా ఉన్న అందరినీ విస్తృతంగా పట్టభద్ర ఓటర్లుగా నమోదు చేసింది . ఇప్పుడు ఈ ఓట్లు కూడా ఏ.ఎస్. లక్ష్మణ్ రావుకు అనుకూలంగా పడే అవకాశం ఉంది . ఏది ఏమైనా వైసీపీ బరిలో లేకపోయినా.. వారి ఓటు బ్యాంకు మొత్తం లక్ష్మణరావుకు అదనపు బలం కానుంది . ఇలాంటి నేపథ్యంలో ఆలపాటి రాజా గెలుపు కోసం అష్ట కష్టాలు పడుతున్నారు అన్నది కృష్ణ, గుంటూరు జిల్లా రాజకీయ వర్గాలలో వినిపించే టాక్.