వైఎస్ఆర్‌కు నీకు అసలు సంబంధం లేదు.. కడిగిపారేసిన షర్మిల..!

Amruth kumar
ఆంధ్రప్రదేశ్లో అన్న చెల్లి ఆస్తి పంచాయితీ ఇప్పుడు ఎంతో హార్ట్ టాపిక్ గా మారింది. ప్రతి ఇంట్లో ఉండే సమస్య అంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో చెల్లెలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏది సాధారణ సమస్య అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చుకురావటం సాధారణ సమస్య..బెయిల్‌ రద్దు అయ్యేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పటం సాధారణమా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇంతకీ ఆస్తి పంచాయతీపై షర్మిల క్లారిటీ ఇస్తూ ఇవే వాస్తవాలంటూ జ‌గ‌న్‌కు ఆమె ఓ బహిరంగ లేఖను రాశారు. అందులో షర్మిల ఏం చెప్పుకొచ్చింది అనే విషయాలు క్లుప్తంగా ఇక్కడ చూద్దాం.

వైసీపీ అధినేత జగన్ రెడ్డి, చెల్లి షర్మిల మధ్య ఆస్తి పంపకాలపై వివాదం కొనసాగుతున్న వేళ షర్మిల విడుదల చేసిన లేఖ‌ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? రాజకీయంగా నువ్వు నాపై విమర్శలు చేస్తున్న నీకు నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను.. సరస్వతి సిమెంట్ షేర్స్ తిరిగి నాకు ఇచ్చేయండి.. అమ్మ మీద నీ మీద కేసు పెడుతున్న అంటూ సొంత చెల్లి షర్మిలను బెదిరిస్తూ జగన్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో లేఖ రాశారు. ఇక దానికి సమాధానం ఇస్తూ సెప్టెంబర్ 12న షర్మిల 8 అంశాలతో లేఖ రాశారు. ఇప్పుడు ఆ లాఖ‌ ను టిడిపి విడుదల చేసింది. ఆస్తులు విషయంలో తన తండ్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏం చెప్పారో ఈ లేఖ‌ ద్వారా ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం ఈ లేఖ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ.. తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని ఆదేశించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను.. మీరు ఆ షరతుకు అంగీకరిస్తున్నట్లు ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకు ఒప్పుకోనంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్‌, సాక్షి.. ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిక్కచ్చిగా చెప్పారు. వీటన్నింటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు.. మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా అని లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YSR

సంబంధిత వార్తలు: