పిఠాపురంలో "జానీ"లు రెచ్చిపోతున్నారు..పరువు తీసిన యాంకర్‌ ?

Veldandi Saikiran
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ పవన్‌ కళ్యాణ్‌ ఇలాక పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ పవన్‌ కళ్యాణ్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా చూస్తే మహిళలకు ఏమి గౌరవం దక్కుతుందని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళల పై హత్యలు,అత్యాచారాలు నిత్య కృత్యం అయ్యాయని నిప్పులు చెరిగారు. ఒక మహిళ హోం మంత్రిగా వున్నారని గుర్తు చేశారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్న సీఎం చంద్రబాబు, కూటమి నేతలకు పట్టడం లేదని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో జానిలు రెచ్చిపోతున్నారని చురకలు అంటించారు.

దళిత బాలిక పై అత్యాచారం చేశారని ఆగ్రహించారు. పుంగనూరు లో చిన్నారిని హత్య చేశారని మండిపడ్డారు. పోలీసుల కుటుంబానికే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్  ఘటన పై నారా లోకేష్ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు.

పిఠాపురంలో దళిత మైనర్ బాలికపై హత్యాచారం చేసింది టీడీపీ కార్యకర్తనేని శ్యామల పేర్కొన్నారు. దుర్గాడ జానీ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపణలు చేశారు. దుర్గాడ జానీ  అనే వ్యక్తి..పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షులు గారి భర్తననే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూటమి సర్కార్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ పవన్‌ కళ్యాణ్‌ ఇలాక పిఠాపురంలో ఈ సంఘటన జరిగితే.. ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: