దేవర : ఎన్టీఆర్ కోసం రంగంలోకి బాలయ్య, చంద్రబాబు.. ఇక రచ్చ రచ్చే?

Veldandi Saikiran
ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు దేవర చిత్రంతో వచ్చాడు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై నాలుగు రోజులే అయినప్పటికీ దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక మరో 10 రోజుల్లో 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొరటాల శివ రెండు పార్టులుగా తీస్తున్నారు. మొదటి దేవర పార్ట్ వన్ మంచి టాక్ తెచ్చుకోగా ప్రేక్షకులు దేవర 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించాడు. ఎన్నో రోజులుగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.... ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సినిమా సక్సెస్ మీట్ ను గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 3వ తేదీన ఈ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడానికి సోమవారం రోజున నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ ను నిర్వహిస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ పాల్గొననుంది. అంతేకాకుండా ఈ సినిమా సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ పాల్గొననున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్, బాలకృష్ణ కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్టు అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో బాలకృష్ణ పాల్గొన్నట్లయితే వారి కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేనట్లుగా తెలుస్తోంది. ఒకవేళ బాలకృష్ణ ఈ ఫంక్షన్ కు కనక రాకపోతే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు. మరి ఈ ఫంక్షన్ కు బాలకృష్ణ పాల్గొంటారో లేదో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: