మాధవిలతను ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్న వైసీపీ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు వివాదం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ లడ్డు వివాదంలో బిజెపి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత వేలు పెట్టారు. వందే భారత్ ట్రైన్ లో తిరుపతికి వెళ్లి.... వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు మాధవి లత. ఈ నేపథ్యంలోనే బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లతను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు వైసీపీ నేతలు. మోడీని తిట్టకుండా నేరుగా మాధవి లతను... ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా.... మాధవి లతను టార్గెట్ చేసి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాధవి లత ఆసుపత్రి బాగోతాలు మాకు తెలియవా...? అని పేర్కొన్నా నాని పేర్కొన్నారు. ఒక్క హిందువుకైనా బిల్లులు తగ్గించావా...? అంటూ మండిపడ్డారు. అనవసరంగా ఇందులో వేలు పెట్టకూడదని హెచ్చరించారు. తిరుమల డిక్లరేషన్ పై ఆయన స్పందిస్తూ.... బతికితే జగన్ లాగా బతకాలి. జగన్ తాత, తండ్రి క్రైస్తవంలోకి వచ్చారని వాళ్ల గురించి తెలియనిది ఎవరికి అని ప్రశ్నించారు. బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబు గురించి పవన్ మెచ్చుకోలుగా చెప్పడం దారుణమన్నారు.


హైందవ మతాన్ని, దేవుడిని నమ్మేవారు బూట్లు వేసుకొని పూజలు ఎలా చేస్తారని నిలదీశారు. మనిషనే వాడు బూట్లు వేసుకొని పూజలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు అనేక వీడియోలు, ఫోటోలు కూడా సాక్ష్యంగా ఉన్నాయంటూ.... దేవుడు గురించి మీలాంటివారా మాట్లాడేది అంటూ తీవ్రంగా స్పందించాడు. హిందుత్వంపై మాట్లాడే బాబు తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎందుకు తల వెంట్రుకలు తీయించుకోలేదని ప్రశ్నించారు.

తన తల్లిదండ్రులు చనిపోతే తాను తల వెంట్రుకలు తీసుకోలేదు... ఎవరు ఏం పాటిస్తున్నారు, మీరు ఏం ఆచరిస్తున్నారు? మాట్లాడే భాషలు ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తిరుమల వెంకన్నపై నమ్మకం లేకపోతే జగన్ మెట్లు ఎక్కి నడక మార్గాన వెళ్లి దర్శనం చేసుకొని ఎలా వస్తాడు అని పేర్ని నాని అన్నారు. ప్రస్తుతం పేర్ని నాని చేసిన వాక్యాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: