పవన్ భార్య కూడా క్రిస్టియనే..నీ గరుడ పురాణం విప్పుతానంటూ రెచ్చిపోయిన శ్రీ రెడ్డి?

Veldandi Saikiran
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు వివాదం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ లడ్డు వివాదంలో... జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా పవన్ కళ్యాణ్... దీక్ష కూడా ప్రారంభించారు. తిరుమల లడ్డు అపవిత్రమైందని... చెబుతూ 11 రోజుల దీక్షకు పూనుకున్నారు పవన్ కళ్యాణ్.
 
ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని... వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డిని అలాగే వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అదే సమయంలో టాలీవుడ్ హీరోలు, నటుడు ప్రకాష్ ను టార్గెట్ చేసి ఫై ర్ అయ్యారు పవన్ కళ్యాణ్. అయితే ఈ సందర్భంగా కాస్త ఓవర్గానే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
ఇంకేముంది సందులో సడే మియాలాగా శ్రీరెడ్డి కూడా ఈ వివాదంలో వేలు పెట్టింది. మొదటినుంచి పవన్ కళ్యాణ్ అంటే పడని శ్రీ రెడ్డి... తన సోషల్ మీడియా పోస్టు ద్వారా బాణాలు విసిరింది. నీ భార్య క్రిస్టియన్ అంటూ.. రెచ్చిపోయింది. పార్టీ పెట్టినప్పుడు... కమ్యూనిస్టుల్లో తిరిగాడు...  హిందుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాడని శ్రీరెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ చెంతన చేరి...హిందుత్వం అని బిల్డప్పులు ఇస్తున్నాడని శ్రీ రెడ్డి మండిపడ్డారు.
 
ప్రకాష్ రాజు అలాగే తమిళ హీరో కార్తీ మాట్లాడిన దానిలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు.  హిందుత్వాన్ని ఓవర్గా  ప్రాజెక్టు చేసేం దుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. క్రైస్తవ మతాన్ని అవమాన పరుస్తున్నారని కూడా ఆమె గుర్తు చేశారు. హిందుత్వం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్... రష్యా కు చెందిన క్రిస్టియన్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడని కూడా నిలదీశారు నటి శ్రీరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: