హైదరాబాద్‌లో ఆమెతో బీఆర్ఎస్‌ను చావు దెబ్బ‌కొడుతోన్న‌ రేవంత్ రెడ్డి.. !

RAMAKRISHNA S.S.

- పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి
- ఇప్ప‌టికే దానం నాగేంద‌ర్ ను చేర్చుకున్న కాంగ్రెస్‌
- గ్రేట‌ర్ పీఠం పై పాగాయే టార్గెట్ .. !
-  ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .
గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. ఎవరెవరికి పదవులు కట్టబెట్టాలని ఆలోచనలు చేస్తుంది. ఈ క్రమంలో చేరికలపై గట్టిగా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పార్టీలోకి లాగేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలనాటికీ మరికొందరు కిలక నేతలను కూడా హస్తం గూటికి చేర్చుకోనున్నారు. పిసిసి కమిటీ లో బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి తర్వాత అత్యంత కీలకమైన పదవిగా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని గ్రేటర్ లో పట్టు ఉండే నేతలకు అప్పగిస్తే గ్రేటర్‌లో పార్టీ బలోపేతం అవడంతో పాటు ఎన్నికలలో కూడా పాగా వెయ్యవచ్చని నేతలు భావిస్తున్నారు. ఏ క్రమంలోనే పిజేఆర్ కుమార్తె ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విజయా రెడ్డికి.. మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారు.

విజయ రెడ్డికి పదవి ఇస్తే మహిళ కోటతో పాటు.. పిజెఆర్‌కు గ్రేటర్ లో ఉన్న ఇమేజ్ కూడా కలిసి వస్తుందని.. కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. పిసిసిలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు నేతలు ఇప్పటికే అధిష్టానాన్ని కోరుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. తాజాగా పిసిసి అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన మహేష్ గౌడ్‌కు కేటాయించారు. ఈ బీసీ అస్త్రం కూడా కలిసి వచ్చి గ్రేటర్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పాగా వేస్తుంది అన్న నమ్మకాలు అయితే ఆ పార్టీ నేతలతో పాటు రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: