డ్యూటీ ఎక్కిన యాంకర్ శ్యామల... పిల్లికి బిచ్చం వెయ్యలేదంటూ ఏపీ సీఎం పై సంచలన కామెంట్స్.!

lakhmi saranya
టాలీవుడ్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పను అక్కర్లేదు. ఈమె యాంకర్ గా ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడుకు పార్టీ లో ఉన్నంత పదవిని అప్పగిస్తూ వైసిపి పార్టీ అధినేత జగన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమెతో పాటు ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా ఆపాయింట్ చేసింది. పార్టీ పరంగా పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి హోదా లేకుండానే ఆమె గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డారు. దీన్ని గుర్తించిన జగన్..శ్యామలను పార్టీకి అధికార ప్రతినిధిగా నయమించారు. ఇక పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించినందుకు శ్యామల పార్టీ అధినేత వైఎస్. జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే...
 వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టిన శ్యామల కూటమి ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ... " ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి పిల్లికి కూడా ఇప్పుడు బిచ్చం వెయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గార్లు సున్నాయి నొక్కులు చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. రెండు ఎన్నికల నుంచి రెండు కోట్లకు పైగా ఎకరాలను సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంతమందికి సహాయ పడ్డారు  అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు.
వరద బాధితులకు కానీ, అది ఇప్పటివరకు ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి. చెవులు రెక్కలు విరుచుకోని వినండి. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తల పై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి... ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధితుల కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయం చేశారు. అలాగే ఇటీవల విశాఖలోని ఓ ఫార్మాకం పెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున జగన్ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: