ఏపీ: కొత్త పెన్షన్ దారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..!

FARMANULLA SHAIK
ఏపీలో ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్‌ అందని ప్రతీ ఒక్క లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్‌ అందిస్తున్నట్లు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అర్హులు కొత్తగా పెన్షన్‌ ఎవరైనా పొందాలనుకునేవారు ఈ నెల లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనర్హులు అయ్యివుండి పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి పెన్షన్ ను రద్దు చేయటం జరుగుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు.ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ పై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెలా ఒకటో తేదీన ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా రూ 4 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఇదే సమయంలో ఏడాది కాలంగా అర్హత ఉండీ పెన్షన్ అందని లబ్దిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూనే ప్రభుత్వం..అనర్హుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది.ఏపీలో కొత్త పెన్షన్ల పంపిణీ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైసీపీ హాయంలో ప్రతీ ఏడాది జనవరి, జూన్ నెలల్లో కొత్త లబ్దిదారులను అర్హుల జాబితాలోకి చేర్చేవారు. గత ఏడాది కాలంగా అర్హత ఉన్నా..పెన్షన్ అందని లబ్దిదారులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వంలో పెన్షన్ కోసం వేచి చూస్తున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ దారులకు పెన్షన్ అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.అదే సమయంలో అనర్హులకు పెన్షన్ కోత పైన కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు అందుకుంటున్నారు. అయితే, కొందరు దివ్యాంగ పెన్షన్లు నకిలీ ధృవపత్రాలతో పొందుతున్నట్లు గుర్తించారు.

ఇటువంటి వారికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేస్తోంది. నకిలీ ధృవపత్రాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వానికి సెర్ప్ ఇచ్చిన నివేదిక మేరకు దాదాపు 60 వేల మందికి తిరిగి వైకల్య నిర్దారణ పరీక్షలు చేయాలని తేల్చారు.కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా జూలై, ఆగస్టు నెలల్లో ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసారు. ఆ సమయంలో అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్లుగా గుర్తించారు. అధికారులకు ఫిర్యాదులు చేసారు. దీంతో,వారికి నోటీసులు జారీ అయ్యాయి. దివ్యాంగులు కొందరు నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు పొందటం పైన జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన తనిఖీ విధానంలోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు. అనర్హులను తొలిగించి..అర్హత ఉన్న కొత్త లబ్దిదారులను గుర్తించి పెన్షన్లు పంపిణీ దిశగా కసరత్తు జరుగుతోంది.ప్రభుత్వ పెన్షన్ పొందేందుకు అర్హతలుమొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేలు మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 కంటే తక్కువగా ఉండాలి. కుటుంబం సభ్యులు ఎవరూ కూడా ఆదాయపు పన్ను చెల్లించకూడదు. కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల తడి 10 ఎకరాల పొడి రెండు కలిపి 10 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి. కుటుంబంలో సభ్యులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. నెలవారి విద్యుత్ వినియోగం 3 యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి. 1000 చదరపు అడుగుల కంటే ఏరియా కలిగి ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లోని కుటుంబం మాత్రమే అర్హులు. ప్రభుత్వ పెన్షన్ తీసుకోకూడదు రిటైర్డ్ పెన్షన్.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 సంవత్సరాలు పూర్తయినటువంటి బీసీలకు పెన్షన్ అమలు చేస్తామని హామీగా కూడా బీసీ డిక్లరేషన్ లో చెప్పారు. SC,ST,BC మైనార్టీలకు కూడా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: