కష్టమైనా నష్టమైనా జగన్ వెంటే.. వైఎస్సార్ కోడలు సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

Reddy P Rajasekhar
మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయాల్లో అంతకంతకూ ఎదగడానికి ఎంతో కష్టపడ్డారనే సంగతి తెలిసిందే. అయితే జగన్ గెలుపులో ఆయన భార్య వైఎస్ భారతికి కూడా వాటా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలలో వైఎస్ భారతి కూడా ఒకరు. వైఎస్సార్ కోడలు వైఎస్ భారతి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా రాజకీయాలకు సంబంధించిన ప్రతి విషయంపై ఆమెకు ఎంతో అవగాహన ఉంది.
 
ఒకవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు వైఎస్ భారతి వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ భారతి బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భారతి సిమెంట్స్ తో పాటు సాక్షి పేపర్, సాక్షి న్యూస్ ఛానల్ లను ఆమె నిర్వహిస్తున్నారు. జగన్ కు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం కలిగినా ఆమె జగన్ కు అండగా నిలబడి ప్రశంసలు అందుకున్నారు.
 
వైఎస్సార్ కోడలు భారతి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు. భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని పలు సందర్భాల్లో ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. జగన్ జైలులో ఉన్న సమయంలో భారతి పాదయాత్ర చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆమె వెనక్కు తగ్గారు. తన గురించి కొన్ని విమర్శలు వచ్చినా వాటిని ఆమె పెద్దగా పట్టించుకోరు.
 
వైఎస్ భారతి గురించి గతంలో కొన్ని ఆరోపణలు వినిపించినా ఆ ఆరోపణలలో వాస్తవం లేదని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. వైఎస్ భారతి వ్యాపార రంగంలో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. వైఎస్ భారతి జగన్ కు సైతం పొలిటికల్ గా తన వంతు సలహాలు, సూచనలు ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. వైఎస్ భారతి కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. భవిష్యత్తులో భారతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: