ఏపీలో జరుగుతున్నది అరాచక పాలన: జగన్
తాజా ధర్నాతో ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. ఈ క్రమంలో అయన దగ్గరున్న చిట్టా విప్పారు.. గడిచిన 50 రోజుల్లో 36 మందిని ప్రస్తుత ప్రభుత్వం హత్య చేసిందని మండిపడ్డారు. పూర్తిగా ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంటూ వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు జగన్.
అక్కడితో ఆగకుండా ఈ విషయమై పలు జాతీయ పార్టీల నేతల్ని కూడా కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించి.. మద్దతు కోరుతున్నట్టు తెలుస్తోంది. అక్కడికి తరలి వెళ్లిన పలు మీడియాలు వేదికగా ఆయన మాట్లాడుతూ... ఈ అరాచక పాలనను అంతమొందించేదాకా దీక్షను విరమించేది లేదని, కేంద్రం ఈ విషయంలో చూసీ చూడక వ్యవహరించడం సబబు కాదని అన్నారు. స్వయంగా మోడీ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.