చంద్రబాబును దారుణంగా టార్గెట్ చేస్తున్న షర్మిల..??

Suma Kallamadi

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాల్లో చాలా యాక్టివ్ అయిపోయారు. సౌత్ ఇండియాలో కాంగ్రెస్‌ నుంచి చంద్రబాబునురేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. షర్మిల ఆ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే కాంగ్రెస్‌కు ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా అవతరించారు. ఏపీలో సొంత అన్న జగన్ ను ఏకిపారేయడమే కాకుండా సీఎం చంద్రబాబును కూడా కడిగిపారేస్తున్నారు. హామీ ఇచ్చిన ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ఏమైందంటూ ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అమలు చేశారని, మీరు ఎందుకు చేయలేకపోతున్నారని చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చుతున్నారు.
‘‘మహిళలకు ఉచిత ఆర్టీసీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో విజయవంతంగా ప్రారంభించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడి అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహిళలకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణించే సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమం పేద మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాన్ని ఫ్రీగా అందిస్తుంది దీనివల్ల మహిళలు ఫ్రీగా బస్సులో వెళుతూ సిటీలో కూడా జాబు చేసుకోవచ్చు. రెండు రోజుల్లో రేవంత్ ఇలాంటి మంచి పథకాన్ని అమలు చేసి చూపించారు. ఏపీలో బాబు మాత్రం హామీని పట్ల నెరవేర్చే లాగా కనిపించడం లేదు కనీసం దాని గురించి మాట కూడా ఎత్తడం లేదు. ఈ స్కీమ్ ను త్వరగా అమలు చేయాలి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
 అయితే చంద్రబాబు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం   రేవంత్‌తో భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఫ్రీ బస్సెస్ స్కీమ్ అమలు గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ప్రపోజ్ చేయాలంటూ ఇప్పటికే రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. APలో మహిళలకు ఫ్రీ rtc ట్రావెల్ పథకం అమలుకు ఎంతో కాలం పట్టదు. ఈ విషయం తెలుసుకోకుండా ఆ షర్మిల చంద్రబాబును బాగా టార్గెట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: