రెడ్ బుక్: జగన్ కోసం ఆకలితో ఉన్న పులిలా ఎదురుచూస్తున్న లోకేష్?

Purushottham Vinay

• జగన్ పై పీకల్లోతు కోపంలో ఉన్న లోకేష్ 


• పక్కా ఆధారాలతో జగన్ ని పట్టుకోడానికి ఎదురుచూస్తున్న లోకేష్ 


• జగన్ పట్టుబడితే ఇక చుక్కలే అన్నట్లు ఫిక్సయిన లోకేష్ 


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: యువగళం పాదయాత్ర సమయంలో నేటి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ కేసులు, ఓవరాక్షన్ చేసిన అధికారులు ఇంకా వైసీపీతో అంటకాగి ఇష్టానుసారం ప్రవర్తించిన ఉన్నతస్థాయి అధికారుల పేర్లన్నీ ఇందులో ఉన్నాయని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.జాతీయ మీడియా వేదికగా ఇదే రెడ్ బుక్పై.. అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తలు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని స్పష్టం చేశారు నారా లోకేష్. అయితే.. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రెడ్ బుక్ వ్యవహారంపై స్పందించిన దాఖలాలే లేవు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసొచ్చాక మీడియాతో మాట్లాడిన జగన్.. ఈ రెడ్ బుక్పై తొలిసారి స్పందించడం చేశారు. 


రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇంకా అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు కూడా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటివి వెంటనే ఆపాలన్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే నారా లోకేష్ ఆపే ప్రసక్తే లేదని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ని, తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబుని సూటి పోటీ మాటలతో ఎంత టార్చర్ చేశారో తెలిసిందే. అయితే జగన్ ని కక్ష్యతో మాత్రమే కాకుండా పక్కా ప్రూఫ్ తో పట్టుకొని శిక్షించడానికి లోకేష్ విచారణ చేస్తున్నాడు. ఆయన విచారణలో ఏమాత్రం కూడా జగన్ మోహన్ రెడ్డి అక్రమాలు బయట పడ్డ ఖచ్చితంగా మళ్ళీ జైలుకే పరిమితం చెయ్యాలని లోకేష్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.ఈ రెడ్ బుక్ వల్ల జగన్ తో పాటు ఆయన పార్టీ నేతలకి కూడా ఎప్పుడు ఏమయ్యిద్దో అని టెన్షన్ మొదలైంది. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందనేది..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: