జ‌గ‌న్ ముద్దుల ఫ్రెండ్‌కు... ఇప్పుడు 70 ఎంఎం సినిమా క‌నిపిస్తోందిగా..?

RAMAKRISHNA S.S.
ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంలో ఓ మాజీ మంత్రి... ఇంకా చెప్పాలంటే చంద్ర‌బాబు పై పేద్ద గ్యాంగ్‌ను వెంటేసుకుని బాబు ఇంటికి వెళ్లి దాడి చేసి నానా ర‌భ‌స క్రియేట్ చేసి వార్త‌ల్లోకి ఎక్కారు. అలాంటి నేత‌ను జ‌గ‌న్ మెచ్చి మంత్రి ప‌ద‌వి ఇస్తే మంత్రి గా ఉన్న‌ప్పుడు ఇష్టం వ‌చ్చిన‌ట్టు అందిన కాడ‌కు దోచుకున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై తీవ్రంగా ఉన్నాయి. జ‌గ‌న్ సైతం ప‌దే ప‌దే ఆ నేత‌ను చూసి మురిసి పోతూ ప్ర‌శంస‌లు కురిపించే వారు. ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డంతో ఆయ‌న త‌న ఇంటికి పోలీసులు ఎప్పుడు వ‌స్తారో అని వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది.

ఆ నేత ఎవ‌రో కాదు మాజీ మంత్రి జోగి రమేష్ .. జోగి ర‌మేష్‌ పోలీసులు ఎప్పుడు వస్తారా అని తన ఇంట్లో ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. జోగి అడ్డగోలుగా చేసిన భూకబ్జాలపై సైతం పూర్తి స్థాయి ఆధారాలతో సహా ఫైల్ రెడీ అయ్యింద‌ని.. ఇది తాజాగా డీజీ పీ వ‌ద్ద‌కు కూడా చేరిన‌ట్టు తెలుస్తోంది. అయితే డీజీపీ ఆ ఫైల్ ను సీఐడీ కి ఇస్తారా లేదా ఏసీబీకీ ఇస్తారా ? అన్న‌ది ప్రస్తుతానికి స‌స్పెన్స్ గా ఉంద‌ని కూడా చ‌ర్చ న‌డుస్తోంది.

ఇక జోగి ర‌మేష్ క‌బ్జా చేసింది.. అమ్మేసింది స్వ‌యంగా అగ్రిగోల్డ్ ఆస్తి అని ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై స్వయంగా అగ్రిగోల్డ్ యజమానులే ఫిర్యాదు చేశారు. వైసీపీ ఉన్నప్పుడు అంతా మాదే అనుకోవ‌డంతో పాటు... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది కాబట్టి… ఖాతాల్లో కలిపేసుకోవడం పెద్ద క‌ష్టం కాద‌ని అనుకుని ఉండ‌వ‌చ్చు.. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది... ప్రభుత్వం మారింది . జోగి ర‌మేష్ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేనంతగా దొరికిపోయార‌ట‌.

ఇక జోగి రమేష్ కుమారుడు ఇందులో ప్రత్యక్షంగా ఉన్నట్టు ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం తో ఇద్ద‌రూ అడ్డంగా బుక్ అయిపోయిన‌ట్టే అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక జోగి గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితుడు.... అప్పుడు వైసీపీ ప్ర‌భుత్వంలో ఆయ‌న పేరు చేర్చ‌లేదు.. ఇక ఇప్పుడు పోలీసులు ఆ కేసును కూడా బయటకు తీస్తున్నారు. ఏదేమైనా జోగి కి ఇప్పుడు 70 ఎంఎం సినిమా క‌న‌ప‌డుతోంద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: