ఏపీ: కడపలో పాఠశాలను మూయించిన టిడిపి నేత.. ఆందోళనలో విద్యార్థులు..!

Divya
వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి పార్టీ లోపాలను సైతం చూపిస్తూ వస్తూ ఉండేది. ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తూ ఉండేది. అయితే ఇప్పుడు టిడిపి పార్టీ అధికారంలోకి రావడంతో సాక్షి పేపర్ టిడిపి లోపాలను సైతం ఎత్తిచూపుతోంది.. ఇప్పుడు తాజాగా మరొక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి ఈ విషయాన్ని టిడిపి పార్టీ ఖండిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.. టిడిపి పార్టీ అధికారంలోకి రావడంతో ప్రైవేటు స్కూళ్లకు మూత అంటూ ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చాడనే నేపథ్యంతో ముగిసి వేయించారని.. సుమారుగా 600 మంది విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారనే విధంగా సాక్షి పేపర్ రాసుకుంది.

వైయస్సార్ జిల్లా కమలాపురం  నియోజవర్గంలో టిడిపి నేతలు పైచాచిక మీది అన్నట్లుగా తెలియజేస్తున్నారు. చెరువు కింద పల్లె గ్రామానికి చెందిన కుచ్చం అనంతరెడ్డి కాలాపురానికి చెందిన కొండాయ పల్లెకు చెందిన నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. భారీ ఖర్చుతో భవనాలను సైతం నిర్మించారు.. సుమారు ఇందులో 600 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఈ పాఠశాలను టిడిపి నేత పొత్త నరసింహ కుటుంబానికి సమీపంలో ఉన్నది. ఎన్నికలలో ఆయన కుమారుడు పొత్త చైతన్య కృష్ణ కమలాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కౌంటింగ్ ముగిసిన వెంటనే సదరు టిడిపి నేత పాఠశాల యజమానిని దూషించడమే కాకుండా.. పాఠశాలను మూసివేయాలంటే ఒక హుక్కుమ్ను జారీ చేశారు. అధికారులను ఒత్తిడి చేయించి మరి పాఠశాలను ముగించి వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థు తల్లిదండ్రుల నుంచి పాఠశాల యాజమాన్యం పైన ఒత్తిళ్లు మొదలయ్యాయి.. వారికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నది. దీంతో ఆ పాఠశాల యజమాని కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ నియోజకవర్గం వారీగా ఇది చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: