ఏపీలో ఇంటింటికీ పింఛన్లు సంగతి ఇక లేనట్టేనా?
ఏ రకంగానైనా పింఛన్లు పంపిణీ బాధ్యతను చంద్రబాబు తీసుకుంటానని చెప్పినప్పటికీ సొమ్ములు సమకూర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకోవిషయం ఏమిటంటే ఇంటింటికీ పంపిణీ చేసే విషయంలో మాత్రం ఇంకా బాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా దాఖలాలు కనబడడంలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే గత మేలో జరిగిన ఎన్నికలకు ముందు వలంటీర్ వ్యవస్థను అధికారిక విధుల నుంచి ఎన్నికల సంఘం దూరం పెట్టడంతో వలంటీర్లు ఇంటికే పరిమితం అయ్యారు. మరికొందరు రాజీనామాలు చేశారు. ఫలితం వచ్చి.. సర్కారు ఏర్పడి 10 రోజులకు పైగానే అయినా.. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించేదీ లేదు, అలాగని వారిని తీసేది లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పింఛన్లు అంశానికి సంబంధించి మరో 7 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారు? అనేది ఇపుడు చాలా ఆసక్తిగా మారింది. ఈ సారికి కూడా బ్యాంకుల్లోనే వేస్తారా? లేక.. ఏం చేస్తారు? అనేది చంద్రబాబు మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించాల్సి ఉంది. ఎలానూ రెండు మాసాలుగా బ్యాంకులకు వెళ్లి తెచ్చుకున్నారు కాబట్టి.. పింఛనర్లు అలవాటు పడి ఉంటారు. దీంతో ఈసారి ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు అని కొందరు అంటున్నారు. వలంటీర్ వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పడే వరకు.. జూలై నెల వరకు ఇలానే చేస్తారని మరికొందరు ఫీల్ అవుతున్నారు మరి.