అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..??

Suma Kallamadi
చంద్రబాబు నాయుడు చేపట్టిన భారీ ప్రాజెక్టు అమరావతి గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో అమరావతి క్రమంగా పుంజుకుంటోంది. బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిన ప్రజా వేదిక భవన్‌లో ఆయన పర్యటించారు. అక్కడి నష్టాన్ని అంచనా వేశారు.
అనంతరం రాజధాని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అమరావతి పూజా స్థలాన్ని నాయుడు సందర్శించారు.  ఇతర మంత్రులతో కలిసి, సైట్‌ను సందర్శించి, తిరిగి సందర్శించేటప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు.  పూజా స్థలంలో సాష్టాంగ ప్రణామం చేసి గౌరవం చూపించారు.
ఆ తర్వాత మాట్లాడుతూ ఏపీ అంటే అమరావతి, పోలవరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల ప్రజానీకానికి దశ, దిశ నిర్దేశించే రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయనున్నామని వ్యాఖ్యానించారు. సౌత్ ఇండియాలో ఎక్కువ నీళ్లు ఉన్న నది గోదావరే అని చంద్రబాబు వివరించారు.
పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులలోనైనా కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు, నదులతో కనెక్ట్ చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందేలా చూసుకోవడం తన బాధ్యత అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కావాలని 1,631 రోజులు ఆందోళన చేశారని బాబు గుర్తు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరూ నిరసనలు, ఆందోళనలను విరమించుకున్నారని పేర్కొన్నారు. అంతకాలం పోరాటం చేసిన రైతులకు తమ ప్రభుత్వంతో మంచి రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ రైతులు చేసిన పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అమరావతి పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈసారి బాబు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ఖాయమని చాలామంది భావిస్తున్నారు. ఇక చంద్రబాబు రాకతో ఏపీకి రాజధాని కూడా రాబోతోందని అంటున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందని నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: