అది సైకో పాలనకు ప్రతిబింబం లాంటిది.. వాటిని ముట్టుకోము: బాబు
దాంతో దీని గురించి తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా వంటివారు హైకోర్టుకు వెళ్లినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇక, అప్పటి నుంచి ఆ భవనం యొక్క శిథిలాలు అలానే ఉండిపోయాయి. వాటిని ఎవరూ తొలగించిన పాపానపోలేదు. కనీసం ఆ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో శుభ్రం చేసింది కూడా లేదు. ఇక తాజాగా ఇక్కడ పర్యటించిన చంద్రబాబు.. ఈ శిధిలాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఆ శిధిలాలను మేం కూడా తొలగించం. అవి అక్కడే అలానే ఉండాలి. అది ఒక విధ్వంస పాలనకు, ఒక సైకో ముఖ్యమంత్రి పాలనకు నిదర్శనంగా అక్కడే ఉండాలి. మేం వాటి జోలికి వెళ్లబోము!" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తనను కలిసేందుకు భారీ ఎత్తున ప్రజలు గుమిగూడడంతో చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. అక్కడి పోలీసులు చంద్రబాబును కలవకుండా మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వీటిని చూసిన చంద్రబాబు పోలీసులపై సీరియస్ అయ్యారు. "నేనేమీ పరదాల ముఖ్యమంత్రిని కాదు. నాకు ప్రజల నుంచి బెదిరింపులు వంటివి లేవు. ముందు ఆ బారికేడ్లు తొలగించండి. అదే విధంగా మీ మనసుల్లోని బారికేడ్లు కూడా తొలగించుకోండి!" అని ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ప్రజలు తనను కలిసేందుకు ఎక్కడనుంచి ఎప్పుడైనా రావచ్చు. దానికోసం ప్రత్యేకంగా సచివాలయంలో ఒక ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు.