వైసీపీతో ఒక ఆట ఆడేసుకున్న టీడీపీ తమ్ముళ్లు..??
గడిచిన 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ సమయంలో ఈ పార్టీ సోషల్ మీడియా యూజర్లు టీడీపీ వాళ్లని ఒక ఆట ఆడుకున్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని, పావలా కళ్యాణ్ అని, చంద్రబాబు కాళ్లు వస్తే వాడు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఇక చంద్రబాబును కూడా తమదైన శైలిలో ఏకిపారేశారు. మామూలుగా చంద్రబాబు లైట్లు, ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టింది తానే అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ వీడియోలను షేర్ చేస్తూ చంద్రబాబు నార్సిసిజం బాగా పెరిగిపోయిందంటూ విమర్శించేవారు.
కానీ ఇప్పుడు వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. టీడీపీ వాళ్లు బాగా యాక్టివ్ అయ్యారు. వీళ్లు వైసీపీని బాగా టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు వారి ట్రోలింగ్ పీక్ స్టేజ్కి చేరుకుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దాంతో వైసీపీ వాళ్లు 23 నంబర్ను టీడీపీ పార్టీలో జరిగే రకరకాల సంఘటనలతో లింక్ చేస్తూ వెటకారాలు చేసేవారు. టీడీపీ వాళ్లు వాటన్నిటినీ భరించారు. చివరికి టీడీపీ తమ్ముళ్లకు వైసీపీ వాళ్లను ఎగతాళి చేసే సమయం వచ్చింది. ఎందుకంటే వైసీపీ కేవలం 11 సీట్లే గెలుచుకుంది. 23 గెలుచుకుంటేనే చాలా చులకనగా చూశారు వైసీపీ వాళ్లు, కానీ ఇప్పుడు వాళ్లే అందులో సగం సీట్లు కూడా గెలుచుకోలేకపోయారు. దాంతో వీరి తల తీసేసినంత పని అయింది. ఈ ఘోరమైన పరాజయాన్ని గుర్తుచేస్తూ కూటమి మద్దతుదారులు వైసీపీని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. వారు ఆ నంబర్ను ఆడుదాం ఆంధ్రతో లింక్ చేస్తూ వెటకారాలు చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్రాలో మిగిలింది 11మందే వైసీపీ గెలిచింది 11 మందే అంటూ ఆట పట్టిస్తున్నారు.